S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 00:31

ముంబయి, డిసెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.66 పాయింట్లు పెరిగి 26,392.76 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.40 పాయింట్లు అందుకుని 8,143.15 వద్ద నిలిచింది.

12/07/2016 - 00:31

ముంబయి, డిసెంబర్ 6: టాటా-మిస్ర్తిల మాటల యుద్ధం ఆగడం లేదు. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను మిస్ర్తి మంగళవారం సమర్థించుకున్నారు. ముఖ్యంగా ఐరోపాలోని టాటా స్టీల్ మూసివేత నిర్ణయం సరైనదేనన్నారు. నష్టాల్లో నడుస్తున్న యూరోపియన్ టాటా స్టీల్ వల్ల మొత్తం టాటా గ్రూప్ ఉనికికే ప్రమాదం ఏర్పడేదని చెప్పారు.

12/07/2016 - 00:29

విశాఖపట్నం, డిసెంబర్ 6: అటవీ ఉత్పత్తుల్లో ముఖ్యమైనది, సహజ సిద్ధమైన, ఆరోగ్యప్రదమైన కుంకుళ్ళ నుంచి హెయిర్ షాంపును తయారు చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. నూతన సంవత్సర కానుకగా దీనిని దేశీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన రెండేళ్ళ కాలంలో అనేక రకాలైన ఆకర్షణీయమైన పథకాలు, ప్రయోగాలతో చక్కటి ఫలితాలు సాధించిన జిసిసి..

12/07/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్.. ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పరిమితస్థాయి ఉచిత డేటా వినియోగంతో నెట్‌పై 3 నెలల అపరిమిత కాల్స్‌ను ముందుకుతెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకూ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 148 రూపాయలకే ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది.

12/07/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబరు 6: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థికంగా చిక్కుల్లోపడిన కోళ్ళ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ పౌల్ట్రీ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంపి జితేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పౌల్ట్రీ సంఘం నాయకులు రంజిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రమేష్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆర్థిక మంత్రితో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

12/07/2016 - 00:19

కర్నూలు, డిసెంబర్ 6: నగదు రహిత లావాదేవీలను ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో కూడా స్వైపింగ్ యంత్రాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. ప్రతి మీ సేవా కేంద్రం నిర్వాహకుడు తమ బ్యాంకుకు వెళ్లి స్వైపింగ్ యంత్రం తీసుకోవాలని సూచించింది.

12/07/2016 - 00:18

కర్నూలు, డిసెంబర్ 6: ఇంత కాలం పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

12/07/2016 - 00:18

కర్నూలు, డిసెంబర్ 6:పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన కరెన్సీ కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ మొద టి వారం కావడంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు ఏటిఎం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఏటిఎంలో పెట్టిన డబ్బులు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు. బ్యాంకు ల్లో ఖాతాదారులకు రూ.

12/07/2016 - 00:17

నంద్యాల, డిసెంబర్ 6:పట్టణంలోని బొమ్మలసత్రంలో నిర్మిస్తున్న ఓవర్‌బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఆర్‌అండ్‌బి అధికారులు ఇఇ రాజేంద్రయ్య, డిఇ ముక్తియార్‌పై ఆగ్రహం వ్యక్తం చేవారు. వంతెన కింది భాగాన రోడ్డు పనులను వేగంగా పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతించాలన్నారు.

12/07/2016 - 00:17

కర్నూలు సిటీ, డిసెంబర్ 6:కాయలను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు, కడప జిల్లాల జోనల్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనాథ్‌రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సి.క్యాంప్ సెంటర్‌లో ఉన్న పండ్ల దుకాణాలపై ఆయన దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్లను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడితే ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు.

Pages