S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/07/2016 - 01:30

ముంబయి, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన నేపథ్యంలో, ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఐదవ, చివరి టెస్టు జరుగుతుందా లేదా అన్న అనుమానం తలెత్తుతున్నది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు.

12/07/2016 - 01:29

కాన్‌బెరా, డిసెంబర్ 6: న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన రెండో వనే్డను ఆస్ట్రేలియా 116 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకుంది. చివరిదైన మూడో వనే్డ ఫలితంతో సంబంధం లేకుండా ఆసీస్‌కు సిరీస్‌ను అందించిన ఘనత డేవిడ్ వార్నర్‌కు దక్కుతుంది. అతను సెంచరీతో కదంతొక్కి, ఆసీస్ విజయంలో కీలక భూమిక పోషించాడు.

12/07/2016 - 01:27

లండన్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్ వనే్డ జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ మళ్లీ పగ్గాలు చేపట్టనున్నాడు. భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లేందుకు మోర్గాన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనితో అతని స్థానంలో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ నాయకత్వం వహించాడు.

12/07/2016 - 01:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దు ప్రభావం క్రీడా రంగంపైనా పడింది. దీని కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని, అందుకే ఈసారి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)లో రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ వంటి స్టార్లు పాల్గొనడం లేదని టోర్నీ వ్యవస్థాపకుడు మహేష్ భూపతి తెలిపాడు. దేశంలో ఆర్థిక పరిస్థితి టోర్నీకి అనుకూలంగా లేదని వ్యాఖ్యానించాడు.

12/07/2016 - 01:24

అసన్సియన్, డిసెంబర్ 6: ఇటీవల కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మినహా మిగతా క్రీడారులందరినీ కోల్పోయిన చపెకొయన్స్ జట్టుకు సుడామేరికానా టైటిల్‌ను ప్రకటించారు. కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుడామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్రీడాకారులు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మొత్తం 71 మంది దుర్మరణం చెందారు.

12/07/2016 - 01:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు మంగళవారం ఘనంగా నివాళి అర్పించారు. జయ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం ప్రకటించింది. జయ మృతి జీర్ణించుకోలేని విషాదమని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.

12/07/2016 - 01:15

చెన్నై, డిసెంబర్ 6: తమిళనాడు రాష్ట్రానికి డిసెంబర్ ఒక దురదృష్ట మాసంగా పరిణమించిందని జయలలితకు నివాళి అర్పించటానికి వచ్చినవాళ్లు చర్చించుకున్నారు. బహుళ ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎంజి రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న చనిపోయారు. అంతే ప్రజాదరణ పొందిన జయలలిత కూడా డిసెంబర్‌లోనే (సోమవారం) కన్నుమూశారు. ఇద్దరు నేతలూ చాలాకాలంపాటు అనారోగ్యంతో బాధపడ్డారు.

12/07/2016 - 01:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలితకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీలు ఘనంగా నివాళులర్పించగా, కేరళ, కర్నాటక రాష్ట్రాలు ఒక రోజు సంతాప దినాలను ప్రకటించాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించడమే కాకుండా ఆమెకు గౌరవసూచకంగా పది నిమిషాలపాటు వాయిదాపడింది.

12/07/2016 - 01:11

చెన్నై, డిసెంబర్ 6: ‘అమ్మ’ బ్రాండ్‌తో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రకటించిన ఉచిత తాయిలాలు, పథకాలు ఆమెకే ప్రత్యేకమైనవిగా నిలవడమే కాకుండా, ప్రధాన ప్రత్యర్థి అయిన కరుణానిధి నేతృత్వంలోని డిఎంకెను చిత్తు చేయడానికి తోడ్పడ్డాయని చెప్పవచ్చు. అమ్మ క్యాంటీన్లు, అమ్మ జిమ్నాసియంలు, పార్కులు.. ఒకటేమిటి, ప్రతిదానికీ ‘అమ్మ’ పేరు ఉండడం సర్వసాధారణమైపోయింది.

12/07/2016 - 01:08

చెన్నై, డిసెంబర్ 6: తమ ప్రియతమ నేత జయలలిత మరణించిందన్న వార్త విని తమిళనాడులో మంగళవారం ముగ్గురు గుండెపోటుతో చనిపోయారు. కోయంబత్తూర్‌లో టెలివిజన్‌లో జయ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వింటున్నవారు ఆమె మరణ వార్త విని కుప్పకూలిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

Pages