S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/12/2017 - 03:36

అమరావతి, సెప్టెంబర్ 11: వడ్డించేవాడు మనవాడైతే ఏ వరసలో కూర్చున్నా ఫర్వాలేదన్నట్లుంది విద్యుత్ శాఖలో నియామకాల వ్యవహారం. తాజాగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా, వాటిని బేఖాతరు చేసి సీఎంఓలోని ఓ సీనియర్ అధికారి చక్రం తిప్పిన ఫలితంగా ఈపీడీసీఎల్ సీఎండి పదవి హెచ్‌వై దొరనే వరించనున్నట్లు సమాచారం.

09/12/2017 - 03:35

విజయవాడ, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంటే అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్ష వైకాపా నాయకులు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

09/12/2017 - 03:34

విజయవాడ, సెప్టెంబర్ 11: భారతీయ వాయుసేన కమాండోస్ సోల్జర్ పరీక్షకు సోమవారం నిర్వహించిన 1.6 కిలోమీటర్ల పరుగుపందెంలో 123 మంది అర్హత సాధించారు. విజయవాడలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో సోమవారం నిర్వహించిన పరుగుపందెం పోటీలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 2500 మంది అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల పరుగుపందెంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

09/12/2017 - 03:34

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 11: దేశంలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో చేపట్టిన భూ సమీకరణ పథకం అద్భుతంగా ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి ఎస్‌కె మోదీ అభినందించారు. అమరావతి నగరానికి రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములు సమీకరించిన విధానంపై అధ్యయనానికి ప్రత్యేకంగా వచ్చిన ఆయన సోమవారం విజయవాడ ఏపి సిఆర్‌డిఏ కార్యాలయాన్ని సందర్శించారు.

09/12/2017 - 03:31

విశాఖపట్నం, (స్పోర్ట్స్) సెప్టెంబర్ 11: ఒలింపిక్స్ నిర్వహించడానికి తగిన క్రీడా సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక్కడి నోవాటెల్ హోటల్‌లో సోమవారం జరిగిన ఇండియన్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

09/12/2017 - 03:28

విజయవాడ, సెప్టెంబర్ 11: ఆక్వా సాగులో నిషేధిత యాంటీబయాటిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను కాదని ఎవరైనా వాడితే కఠినచర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

09/12/2017 - 03:28

అమరావతి, సెప్టెంబర్ 11: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఒకే సామాజికవర్గానికి పట్టం కడుతున్నారన్న ప్రచారాన్ని నిదర్శనాలతో సహా నిరూపించేందుకు ప్రతిపక్ష నేత వైసీపీ సిద్ధమవుతోంది.

09/12/2017 - 03:20

గుంటూరు, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు అధీనంలో ఉన్న దర్గాలను మానవ దెయ్యాలు పట్టిపీడిస్తున్నాయి. వేల కోట్ల విలువ చేసే ఆస్తులు పరాధీనం అవుతున్నాయి. మత విశ్వాసాలతో దర్గాలకు వచ్చే భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ముత్తవల్లీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా సౌకర్యాల కల్పన మృగ్యమవుతోంది. అంతేకాదు కోట్లాది రూపాయల హుండీల సొమ్ము స్వాహా అవుతోంది.

09/12/2017 - 03:19

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: డబ్బై ఏళ్ళుగా జరగని అభివృద్ధి మూడేళ్ళలో చేసి చూపించాను.. 2014లో అన్యాయంగా విభజన జరిగింది.... కట్టుబట్టలతో పంపేశారు.. మూడేళ్ళుగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను... ‘ప్రజలే ముందు’ మంత్రంగా పాలిస్తున్నాను... మళ్లీ పరిపాలించే శక్తి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

09/12/2017 - 03:17

చీరాల, సెప్టెంబర్ 11: ‘ముఖ్యమంత్రి గాని, నేను గాని ధ్యాస పెడితే చాలదు. క్షేత్రస్థాయిలో వైద్యులు, వైద్యసిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలి. భవనాలు, వైద్యపరికరాలు ఉన్నంత మాత్రాన ఫలితం ఉండదు. పేదవారికి సరైన వైద్యం అందించినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది.

Pages