-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్, నవంబర్ 4: ఇంధన, విద్యుత్ సంరక్షణ రంగంలో అత్యంత అద్భుతమైన విధానాలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభాష్చంద్ర గార్గ్ ప్రకటించారు. ఢిల్లీలో ఇంధన సంరక్షణపై ప్రపంచ బ్యాంకు సంకలనం చేసిన నివేదికను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు.
హైదరాబాద్, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నియామకం చెల్లదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. కారెం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ జె ప్రసాదబాబు, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ తీర్పును వెలువరించారు.
కాకినాడ, నవంబర్ 4: స్వాతంత్య్రానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రథమ ప్రధాని అయివుంటే దేశం దశ, దిశ మారిపోయివుండేవని, ముఖ్యంగా నిత్యం రగులుతున్న కాశ్మీర్లో కల్లోలం ఉండేది కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. పటేల్ దేశానికి తొలి ప్రధాని కాకపోవడం మన దురదృష్టమన్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట వద్ద శుక్రవారం ఒక ప్రైవేటు కార్పొరేట్ స్కూలు ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు.
తిరుపతి, నవంబర్ 4: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి 2017 జనవరి 1నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు 1,00,147 ఆర్జిత సేవా టిక్కెట్లను ఇంటర్నెట్లో భక్తులకు అందుబాటులో ఉంచామని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు.
నంద్యాల/పాణ్యం, నవంబర్ 4: రిజర్వాయర్ నిర్మిస్తే నీళ్లొస్తాయని, పంటలు బాగా పండుతాయని గోరుకల్లువాసులు ఆశించారు. వారు ఆశించినట్టే రిజర్వాయరూ వచ్చింది.. నీళ్లూ వచ్చాయి... అయితే అవే నీళ్లు తమపాలిట శాపంగా మారుతాయని ఊహించకలేకపోయారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి నీరు నిల్వచేయడంతో గోరుకల్లు గ్రామంలో నీటి ఊటలు ఏర్పడి నీరు ఉబికివస్తోంది.
విజయవాడ, నవంబర్ 4: తెలుగులో మాట్లాడితే దండించడం, విద్యార్థుల మెడల్లో పలకలు వేయడం వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశించారు.
రాజమహేంద్రవరం, నవంబర్ 4: గోదావరి నదిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం స్ఫూర్తితో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని చెబుతున్న పాలకులు నిధుల మాటెలావున్నా, ప్రస్తుతం ఫైళ్లను మాత్రం పరుగెట్టిస్తున్నారు. శరవేగంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయడానికి రంగం సిద్ధంచేశారు. ముఖ్యమంత్రితో భూమి పూజ చేయించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.
కాకినాడ, నవంబర్ 4: తెలుగుదేశం-బిజెపితో కలసివుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఒకవేళ విడిపోతే రాష్ట్రానికే నష్టమని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కొందరు బిజెపి నుండి విడిపోతే మంచిదంటున్నారని, అలా జరిగితే రాష్ట్ర ప్రజలు నష్టపోతారన్నారు.
కాకినాడ, నవంబర్ 4: కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు సభ నేపథ్యంలో ‘ప్రత్యేక ప్యాకేజీ వద్దు... ప్రత్యేక హోదానే ముద్దు..’ అంటూ నినదించిన జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జెఎన్టియు ఎదురుగా శుక్రవారం సాయంత్రం వెంకయ్య బహిరంగ సభలో పాల్గొన్నారు. అప్పటికే కొందరు జనసేన కార్యకర్తలు వేదికకు సమీపంలోని ఓ అపార్ట్మెంట్ పైకి ఎక్కారు.
విజయవాడ, నవంబర్ 4: విశాఖపట్నంలో ప్రేమోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఒక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారంపై రాష్ట్ర పర్యాటక, పురపాలక శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 9వేల మంది విదేశీ జంటలతో ప్రేమ పేరుతో విష సంస్కృతిని విశాఖలో చొప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు వచ్చిన కథనాలను ఖండించారు.