S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/04/2016 - 03:29

పెనుకొండ, నవంబర్ 3 : రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రవీంద్ర గురువారం ల పెనుకొండలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యాలయాల భవనాలకు అవసరమైన స్థలాల కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు.

11/04/2016 - 03:29

గుంటూరు, నవంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా పెట్రో, డీజిల్ బంకుల నిర్వాహకుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. ఏపిలో 2700 వరకు బంకులు ఉన్నాయి. నిత్యం కోట్లాది లీటర్ల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు, ఖర్చులకు అనుగుణంగా తమ కమీషన్ చార్జీలు పెంచాలని డీలర్లు దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో గతంలో ప్రభుత్వం అపూర్వచంద్ర కమిటీని నియమించింది.

11/04/2016 - 03:10

అమరావతి, నవంబర్ 3: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ - భారతీయ జనతా పార్టీ సంబంధాలకు పూర్తిస్థాయిలో తెరపడిందా? ఏపి బిజెపి ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. పవన్ ఎన్డీఏలో లేరని, ఆయన కేవలం గత ఎన్నికల్లో తమకు మద్దతు మాత్రమే ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా పవన్ ఎన్డీఏలో ఉన్నారో, లేరో ఆయనే చెప్పాలని బిజెపి నేతలు పేర్కొన్నారు.

11/04/2016 - 02:46

కాకినాడ, నవంబర్ 3: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో దివీస్ మెడికల్ లేబొరేటరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. సిపిఎం రాష్ట్ర నేత పి మధు సహా పలువురిని అరెస్టుచేశారు.

11/04/2016 - 03:11

గుంటూరు, నవంబర్ 3: కారం.. కారంగా ఉంటే చాలు. అందులో మమకారం మిక్స్ చేయాల్సిన అవసరం లేదంటూ కారం మిల్లులు అక్రమాలకు తెగబడ్డాయి. మొన్నటివరకు తాలుగాయలు, పిచ్చికాయలు దంచి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వినియోగదారుడికి అంటగట్టే విధానానికి తెరదించి నాణ్యమైన మిరపకాయలు, గింజల నుండి నూనె, రంగును వేరుచేయగా మిలిగిన పిప్పి, తొడిమలను పొడిచేసి, అందులో రంగులు రంగరించి ఏకంగా వినియోగదారుల కళ్లల్లో కారం కొడుతున్నారు.

11/04/2016 - 02:40

ఏలూరు, నవంబర్ 3 : అధికార తెలుగుదేశం పార్టీ ఆర్భాటంగా ప్రారంభించిన జన చైతన్యయాత్రలు జాతర మాదిరిగా మారిపోయాయి. మరోసారి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సన్మానాలు, సత్కారాలతో ఈ యాత్రలు ముగుస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేసే ఈ యాత్రల అసలు లక్ష్యం మాత్రం దూరంగానే మిగిలిపోయింది. మొత్తం మీద ప్రహసనప్రాయంగా ఈ జాతర ముందుకు సాగుతోంది.

11/04/2016 - 02:40

చిత్తూరు, నవంబర్ 3: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారుచేసే స్థావరంపై టు టౌన్ పోలీసులు గురువారం రాత్రి దాడులు చేసి నిర్వాహకుడితోపాటు 50 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.

11/04/2016 - 02:39

విశాఖపట్నం, నవంబర్ 3: పశ్చిమ మధ్య బంగాళాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. వచ్చే 12 గంటల్లో వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా మారుతుందన్నారు.

11/03/2016 - 07:16

విజయవాడ, నవంబర్ 2: ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఎబ్బిలి నాగదుర్గారావు(58) బుధవారం నాడిక్కడ స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గారావు ఎంఏ చదివి, 1985లో ఎస్‌ఐగా పోలీసు శాఖలో ప్రవేశించారు. తన సర్వీస్‌లో ఎలాంటి రిమార్కు లేకపోవటంతో త్వరితగతిన పదోన్నతులు పొందుతూ వచ్చారు.

11/03/2016 - 07:12

కడప, నవంబర్ 2: రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అవినీతిలో కూరుకుపోయాయని, డబ్బు ఇవ్వందే పనులు చేయడం లేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు.

Pages