S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/14/2016 - 07:22

హైదరాబాద్,జూలై 13: ఉత్తరాంధ్రలో బలమైన వెలమ వర్గ నేత కోసం టిడిపి, బిజెపి అనే్వషిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి ధర్మాన సోదరులు, టిడిపికి అయ్యన్న, అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల నాటికి మరో బలమైన వెలమ నేత కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా అనకాపల్లి మాజీ ఎంపి, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరిని తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.

07/14/2016 - 07:20

అనంతపురం, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాలువ పనులకు నిధుల గండం ఏర్పడింది. హంద్రీ-నీవాను ఈ ఏడాది ఆగస్టు 31 నాటికల్లా పూర్తిచేయాలని ప్రభుత్వం కాంట్రాక్టు కంపెనీలకు ఆదేశాలిచ్చింది.

07/14/2016 - 07:19

పోలవరం, జూలై 13: పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసం ఎత్తిపోతల పథకం నుండి తోడుతున్న గోదావరి నీరు గురువారం నాటికి కృష్ణా డెల్టాకు చేరుతుందని ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు తెలిపారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి మోటార్లు ఆన్‌చేసిన విషయం విదితమే. కుడి కాలువ నిర్మాణం పూర్తికాని కారణంగా అధికారులు అంచెలంచెలుగా నీటిని తరలిస్తున్నారు.

07/14/2016 - 07:19

విజయవాడ, జూలై 13: ప్రజల సొమ్ము కృష్ణానది పాలవుతోంది. పుష్కరాల పేరుతో రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయో? అవి ఎలా జరుగుతున్నాయో? నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో? పుష్కరాల నాటికి పనులు పూర్తవుతాయో, లేదో? అని తెలుసుకునేవారే కరవయ్యారు. నగరంలో జరుగుతున్న పుష్కర పనులను చూసిన వారెవ్వరైనా ముక్కున వేలేసుకోవలసిందే.

07/14/2016 - 07:14

విజయవాడ, జూలై 13: ఆహార తయారీ రంగంలో 50 వేల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నెలకొల్పనున్న ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు పలు రకాల ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

07/14/2016 - 06:33

రాజమహేంద్రవరం, జూలై 13: గోదావరి వరద ఉద్ధృతి ఉభయ గోదావరి జిల్లాలపై ఇంకా తీవ్ర ప్రభావం చూపుతూనేవుంది. ఎగువన భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, అక్కడి నుండి వరద నీరు దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను బుధవారం కూడా కొనసాగించారు.

07/14/2016 - 06:28

జంగారెడ్డిగూడెం, జూలై 13: రాష్ట్రంలో రైతులు పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లభించడానికి వీలుగా రూ.5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాడు తాను మూడువేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానంటే, చంద్రబాబు ఐదువేల కోట్లతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

07/13/2016 - 15:18

సెయింట్‌పీటర్స్‌బర్గ్:రష్యాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆరో రోజూ కొనసాగింది. బుధవారంనాడు సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో ఆయన పర్యటించారు. కాలువలతో కూడిన ఈ నగరాన్ని చూస్తే అమరావతి నిర్మాణానికి ఉపయోగపడుతుందని బాబు భావిస్తున్నారు. స్థానిక ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపారు.

07/13/2016 - 08:21

హైదరాబాద్, జూలై 12: గుంటూరు జిల్లాలోని సదావర్తి భూముల అమ్మకం వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. అమరావతిలోని శ్రీసదావర్తిసత్రం భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అవసరమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు మంగళవారం నాడు వ్యాఖ్యానించింది.

07/13/2016 - 08:20

ఒంగోలు అర్బన్, జూలై 12: అరిషడ్వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుందని కంచికామకోటిపీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా మంగళవారం ఒంగోలుకు వచ్చిన ఆయనకు టిటిడి కల్యాణమండపంలో టిటిడి అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. కల్యాణ మండపంలో స్వామివారి కంచి పీఠంలో కొలువైన స్వామికి అభిషేకాదులు, పూజలు నిర్వహించారు.

Pages