S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/15/2016 - 05:22

విశాఖపట్నం, జూలై 14: పోలవరం ఎడమ కాలువ పనులు వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిపి గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిధుల సమస్య ఎదుర్కొంటున్నా, ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

07/15/2016 - 05:22

హైదరాబాద్, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు, విద్యార్ధుల తల్లిదండ్రులు, ఇతర స్థానిక ప్రతినిధులను మరింత భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజిమెంట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.

07/15/2016 - 05:21

హైదరాబాద్, జూలై 14: ఆగస్టు 12 నుండి ప్రారంభం అయ్యే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ సమాచార మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ నుండి సమాచార శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్, ప్రెస్ అకాడమి చైర్మన్ వాసుదేవ దీక్షితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

07/15/2016 - 05:20

కర్నూలు, జూలై 14: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బైరెడ్డి శేషశయనారెడ్డి (85) గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన తన స్వగ్రామమైన కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయనకు నలుగురు సంతానం.

07/15/2016 - 05:19

అమ్రాబాద్, జూలై 14: మహబూబ్‌నగర్ - గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం కృష్ణానది ఆలాటంపెంట సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పుట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు గిరిజనులు గల్లంతు అయినట్లు తెలిసింది. అయితే అంతా సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం.

07/15/2016 - 05:18

హైదరాబాద్, జూలై 14: తాను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖర్చు ఎక్కువైందంటూ ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయమై వైకాపా నేత అంబటి రాంబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్పీకర్ చేసినట్లుగా ఉన్న వ్యాఖ్యలు ఉన్న వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి ఒక టీవీ చానల్‌కు నోటీసు జారీ చేశారు.

07/15/2016 - 05:17

విజయవాడ, జూలై 14: జమ్ము, కాశ్మీర్ అల్లర్లలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులు క్షేమంగా వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు.

07/15/2016 - 05:17

మంగళగిరి, జూలై 14: షోరూంకే రాని వాహనాలను గుంటూరు జిల్లా మంగళగిరిలోని మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అంశం వెలుగు చూడటంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. 27 సరుకు రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది.

07/14/2016 - 07:35

హైదరాబాద్, జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేకపోయినా, రెండు విద్యుత్ ప్లాంట్లకు లైసెన్సులు ఇవ్వడం, విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వ నిధులు వెచ్చించడం అనవసరమని, విద్యుత్‌ప్లాంట్లతో కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

07/14/2016 - 07:34

విజయవాడ, జూలై 13: రాజధాని అమరావతిలో రైతులు మరో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇటీవల ప్రభుత్వం ప్లాట్‌లు ఇచ్చింది. మెట్ట ప్రాంతాల్లో ఎకరం భూమి ఇచ్చిన రైతుకు ప్రభుత్వం 1250 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చింది. ఇందులో 1000 గజాలను నివాసిత ప్రాంతంలోను, 250 చదరపు గజాల స్థలాన్ని కమర్షియల్ ప్రాంతంలోనూ ఇచ్చింది.

Pages