S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/14/2018 - 04:56

రాజమహేంద్రవరం: గోదావరి లంక భూముల్లో మొక్కజొన్న విత్తన సాగు ఒక విషవలయంగా మారిపోతోంది. ఇక్కడి భూముల్లో రైతులకు పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న సాగుచేయిస్తున్న పలు బహుళజాతి కంపెనీలు కారుచౌకకు ఉత్పత్తిని కొనుగోలు చేస్తున్నాయి. అదే ఉత్పత్తిని ప్రాసెసింగ్, ప్యాకింగ్ అనంతరం భారీ ధరలకు విక్రయిస్తున్నాయి. మొత్తం మీద మొక్కజొన్న విత్తన సాగులో అహరహం శ్రమించే రైతులు ఘోరంగా చిత్తవుతున్నారు.

12/13/2018 - 22:10

ముంబయి, డిసెంబర్ 13: స్టాక్ మార్కెట్ ఈవారం ఆశాజనకమైన రీతిలో ముగుస్తుందని ట్రేడింగ్ విధానం స్పష్టం చేస్తున్నది. బుధవారం 629.06 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ గురువారం మరో 150.57 పాయింట్లు (0.42 శాతం) పెరిగి, 35,929.64 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా లాభాల బాటను కొనసాగించింది. 53.95 పాయింట్లు (0.50 శాతం) పెరగడం ద్వారా 10,791.55 పాయింట్లకు చేరింది.

12/13/2018 - 22:08

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,080.00
8 గ్రాములు: రూ.24,640.00
10 గ్రాములు: రూ. 30,800.00
100 గ్రాములు: రూ.3,08,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,294.118
8 గ్రాములు: రూ. 26,352.944
10 గ్రాములు: రూ. 32,941.18
100 గ్రాములు: రూ. 3,29,411.08
వెండి
8 గ్రాములు: రూ. 330.40

12/13/2018 - 22:07

ముంబయి, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా రైతు మాఫీ స్కీంను అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కాగా ఈ విధానం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని రైతాంగం సంక్షేమానికి రుణమాపీ పరిష్కారం కాదని ఎస్‌బీఐ రీసెర్చి సంస్థ తెలిపింది. దీని బదులు ఆదాయాన్ని పెంచే పథకాలను ప్రవేశపెట్టాలని ఎస్‌బీఐ కోరుతోంది.

12/13/2018 - 22:05

యాంగన్ (మైన్మార్), డిసెంబర్ 13: భారత్, మైన్మార్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకారం పెరిగిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇరు దేశాలు అనేక రంగాల్లో సహకరించుకుని ముందడుగు వేయాలని ఆయన కోరారు. మైన్మార్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మైన్మార్ ఉపరాష్టప్రతి యూ మియాంటూ స్వీతో చర్చించారు.

12/13/2018 - 22:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా పేపర్ కరెన్సీని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా జరుగుతున్న చెల్లింపులు, వసూళ్లు ఆశాజనకంగా సాగుతున్నాయి. నగదు లభ్యత తగ్గడంతోపాటు, దాదాపు అన్ని బ్యాంకులూ ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడంతో నెఫ్ట్ ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి.

12/13/2018 - 22:01

ముంబయి, డిసెంబర్ 13: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వంలో భాగమని, ఈ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక దార్శనికతను ఆర్‌బీఐ అమలు చేస్తుందన్నారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. రెండు రోజుల క్రితం ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేశారు.

12/13/2018 - 04:27

ముంబయి: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అస్తిత్వ పోరాటం నిన్నమొన్నటిదేమీ కాదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుతో విభేదించిన ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చివరికి రాజీనామా రూపంలో తన నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్‌బీఐకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తికి గండికొట్టి, సొంత ఖాజానాగా వాడుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులు ప్రయత్నించడం కొత్తేమీ కాదు.

12/12/2018 - 23:10

ముంబయి, డిసెంబర్ 12: ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ కేంద్రం శక్తికాంత దాస్‌ను నియమించడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. అంతర్జాతీయ సూచీలు కూడా కలిసి రావడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బుల్ దూకుడు కొనసాగింది. సెనె్సక్స్ సుమారు 630 పాయింట్లు పెరగడం రాబోయే రోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందనే సంకేతాలను పంపింది.

12/12/2018 - 23:08

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,080.00
8 గ్రాములు: రూ.24,640.00
10 గ్రాములు: రూ. 30,800.00
100 గ్రాములు: రూ.3,08,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,294.118
8 గ్రాములు: రూ. 26,352.944
10 గ్రాములు: రూ. 32,941.18
100 గ్రాములు: రూ. 3,29,411.10
వెండి
8 గ్రాములు: రూ. 330.40

Pages