-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
జెనీవా, డిసెంబర్ 12: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35.5 బిలియన్ డాలర్ల నికర లాభం వస్తుందని ప్రపంచ విమానాయాన రంగం భావిస్తోంది. ఇంధనం ధరలు తగ్గడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి పరిశ్రమలు పురోభివృద్ధికి దోహడపడుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్(ఐఏటీఐ) స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 290 విమానయాన సంస్థలకు ఐఏటీఐ ప్రాతినిద్యం వహిస్తోంది.
దుబాయి, డిసెంబర్ 12: తగ్గుముఖం పడుతున్న ధరలు పెంచడానికి, ఉత్పత్తులను స్థిరీకరించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల తయారీని తగ్గించడానికి చమురు ఉత్పత్తి సంస్థలు అంగీకరించాయని యూఏఈ మంత్రి తెలిపారు. ఒపెక్, నాన్ ఒపెక్ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని జనవరి ఒకటి నుంచి ఆరు నెలల పాటు తగ్గించాలని నిర్ణయించారని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆర్థికవేత్త శక్తికాంతదాస్ రిజర్వు బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో శక్తికాంతదాస్ను ఆర్బీఐ గవర్నర్గా కేంద్రం నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లుంటారు.
అమరావతి, డిసెంబర్ 11: నూతన ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి అమెరికాలోని కాలిఫోర్నియా లెజిస్లేటివ్ ప్రతినిధులు సుముఖత వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కాలిఫోర్నియా సెనేట్ సభ్యుడు అష్కల్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సిసిలియా ఆగ్యా, రిచర్డ్ బ్లూం, ఎలిస్ గొమెజ్ రెయిస్, షాలోన్ క్విర్క్ శిల్వా, మార్క్స్టర్ భేటీ అయ్యారు.
ముంబయి, డిసెంబర్ 11: ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు కీలక పాత్ర పోషించడంతో, మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ స్వల్పంగా కోలుకుంది. గత వారం వరుస నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్ చివరిలో ఊరటనిచ్చింది. కానీ, ఈవారం మొదటి రోజైన సోమవారం మరోసారి పతనమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగవేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యను వీలైనంత త్వరలో భారత్కు తెచ్చేందుకు చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మాల్యను భారత్కు అప్పగించాలని లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మాల్యా దాదాపు 13 బ్యాంకులకు బకాయి ఉన్నాడు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: చార్టెర్డ్ అకౌంటెంట్లకు మేనేజిమెంట్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్తో చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎఐ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు పరస్పరం మేనేజిమెంట్, అకౌంటింగ్ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కమోడిటీ మార్కెట్లో కస్టోడియల్ సేవలను అనుమతించే ప్రతిపాదనను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి యోచిస్తోంది. నేడు సెబి బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చ ర్చించనున్నట్లు సెబి వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీస్, కమోడిటీస్ను డెలివరీ చేసేందుకు వీలుగా కస్టోడియల్ సేవలను అనుమతించనున్నారు. బంగారం ఉత్పత్తులు, సెక్యూరిటీస్కు మాత్రమే వీటిని వర్తింపచేయనున్నారు.
ముంబయి, డిసెంబర్ 11: టైమ్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో భారత ఆర్థిక రంగంపై ఐదవ శిఖరాగ్ర సదస్సు ఈ నెల 12వ తేదీన ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ పాల్గొంటారు. భారత్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ఐదు ట్రిలియన్ల డాలర్ల వృద్ధిరేటు అంశంపదై సదస్సు జరుగుతుంది. ఈ వివరాలను ఫెడెక్స్ ఎక్స్ప్రెస్ సీఈవో రాజ్ సుబ్రహ్మణియన్ చెప్పారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వ్యవసాయ రుణాలను డిజిటల్ పద్ధతిలో రైతులకు పంపిణీ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టులను ఒకటి రెండు చోట్ల నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ ఎండీ పీకే గుప్తా చెప్పా రు. రైతుల భూ రికార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఈ రుణాలివ్వడం సులభమవుతుందన్నారు.