S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/09/2017 - 00:33

దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. శుక్రవారం ఈ-ఆల్ఫా పేరిట సరికొత్త ఈ-రిక్షాను
మార్కెట్‌కు పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.12 లక్షల రూపాయలు.
భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తమకంటూ ప్రత్యేక స్థానంపై దృష్టి పెట్టిన మహీంద్ర..
వీలైనంత ఎక్కువగా కొత్త వాహనాలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఈ-వెర్టియో, ఈ-20 ప్లస్ వంటి

09/09/2017 - 00:31

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఇవూమి.. శుక్రవారం భారతీయ మార్కెట్‌లోకి రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది.
మి 3, మి 3ఎస్ పేరిట పరిచయమైన వీటిలో మి 3 ధర 5,499 రూపాయలవగా, మి 3ఎస్ ధర 6,499 రూపాయలు.
మి 3లో 2జిబి ర్యామ్, 16జిబి స్టోరేజ్ సామర్థ్యం, మి 3ఎస్‌లో 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజ్ సామర్థ్యం ఉన్నాయ.

09/09/2017 - 00:30

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ వాహనాల బ్రాండ్.. జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల ఆగస్టులో గతంతో పోల్చితే 4.3 శాతం పెరిగాయి. ఈ ఆగస్టులో 38,519 యూనిట్ల విక్రయాలను జెఎల్‌ఆర్ నమోదు చేసింది. చైనాలో రేంజ్ రోవర్ వెలార్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్‌ఎల్ మోడల్ వాహనాలు విడుదల కావడం కలిసొచ్చిందని జెఎల్‌ఆర్ పేర్కొంది.

09/09/2017 - 00:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) నూతన అధ్యక్షుడిగా ఫోర్స్ మోటార్స్ చైర్మన్ అభయ్ ఫిరోడియా ఎన్నికయ్యారు. అలాగే మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు రాజన్ వధేరా కొత్త ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక కోశాధికారిగా మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెనిచి అయుకవ నియమితులయ్యారు.

09/09/2017 - 00:29

ముంబయి, సెప్టెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా స్వల్ప లాభాలకే పరిమితమయ్యా యి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 24.78 పాయింట్లు పెరిగి 31,687.52 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 4.90 పాయింట్లు అందుకుని 9,934.80 వద్ద నిలిచింది. ఇకపోతే తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం సెనె్సక్స్ 204.71 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 39.60 పాయింట్లు క్షీణించింది.

09/09/2017 - 00:28

ముంబయి, సెప్టెంబర్ 8: ఐసిఐసిఐ లాంబార్డ్ ఐపిఒ సందర్భంగా 19 శాతం వాటాను ప్రమోటర్లు ఉపసంహరించుకుంటున్నారు. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐకి చెందిన బీమా రంగ సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ).. ఈ నెల 15న రానున్నది తెలిసిందే. ఐదు రోజులపాటు జరిగే ఈ ఐపిఒ 19న ముగియనుంది.

09/09/2017 - 00:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎలక్ట్రిక్ ఆధారిత వాహనాల వినియోగాన్ని పెంచే బాధ్యత ఆటో రంగ సంస్థలపైనా ఉందని దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. వాతావరణంలో ప్రమాదకర స్థాయికి చేరిన వాహన కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే.

09/09/2017 - 00:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్) మధ్యంతర చైర్మన్‌గా యుఐడిఎఐ సిఇఒ ఎబి పాండే శుక్రవారం నియమితులయ్యారు. గత నెల 29న జిఎస్‌టిఎన్ తొలి చైర్మన్ నవీన్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో ఏర్పడిన ఖాళీని పాండేతో తాత్కాలికంగా భర్తీ చేసింది కేంద్రం.

09/09/2017 - 00:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: అమెరికాకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్.. రెండు మోడల్స్‌పై భారీ స్థాయిలో ధరలను తగ్గించింది. ఫ్యాట్ బాయ్, హెరిటేజ్ సాఫ్‌టెయిల్ క్లాసిక్ 2017 ఎడిషన్స్ ధరలను 2.5 లక్షల రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం ఫ్యాట్ బాయ్ ధర 17,01,000 రూపాయల నుంచి 14,99,990 రూపాయలకు దిగిరాగా, 2,01,010 రూపాయలు తగ్గింది.

09/09/2017 - 00:22

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రోడ్లు, సాగునీరు తదితర భారీ నిర్మాణ రంగ, వౌలిక వసతుల ప్రాజెక్టులన్నింటికీ వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి మినహాయింపు ఇవ్వాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) కోరింది. ఈ ప్రాజెక్టులపై పని చేస్తున్న చిన్న, మధ్య, భారీ కాంట్రాక్టర్లు సహా సివిల్ ఇంజినీరింగ్ నిర్మాణ రంగ కంపెనీలకు జిఎస్‌టి ప్రభావం వల్ల భారీ నష్టం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Pages