-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, నవంబర్ 7: ఆంధ్రాబ్యాంకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.122 కోట్ల నికర లాభాలు ఆర్జించినట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభాల్లో 35 శాతం వృద్ధిరేటును సాధించింది. వ్యాపారంలో 5.20 శాతం, డిపాజిట్లలో 5.45 శాతం, అడ్వాన్సుల్లో 5.40 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. రిటైల్ పోర్ట్ఫులియా 5.87 శాతం వృద్ధిని సాధించింది. బ్యాంకుకు మొత్తం 2876 బ్రాంచీలు ఉన్నాయి.
విజయవాడ, నవంబర్ 7: మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని బార్ల సంఖ్యను నియంత్రించనున్నారు. వచ్చే జనవరి 1 నుంచి బార్ల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఆదాయార్జన శాఖలపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలను జారీ చేశారు.
ముంబయి, నవంబర్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ గురువారం మరోదఫా జీవితకాల గరిష్ట స్థాయి లాభాలను నమోదు చేసింది. అలాగే నిఫ్టీ ఐదు నెలల తర్వాత 12 వేల మార్కును దాటింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా సంస్కరణలు మదుపర్లలో సానుకూల దృక్పథాన్ని కలిగించగా, మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో ప్రగతి కూడాప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 7: కుంభకోణాల ఊబిలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం నాడిక్కడ తెలిపారు. ప్రస్తుతం ఈ బ్యాంకు అవినీతికి సంబంధించి ఫోరెన్సిక్ ఆడిటింగ్ సాగుతోంది.
న్యూఢిల్లీ, నవంబర్ 7: యూకో బ్యాంకు వాటాలు గురవారం 4 శాతం లాభపడ్డాయి. గత సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి ఈ బ్యాంకు రూ. 891.98 కోట్ల నష్టాన్ని నమోదు చేసినప్పటికీ వాటాలపై ఆ ప్రభావం పడకపోవడం గమనార్హం. బీఎస్ఈలో ఈ బ్యాంకు వాటాలు 3.64 శాతం లాభపడి ఒక్కోవాటా రూ. 14.23 వంతున ట్రేడైంది. ఓ దశలో ఈ వాటాలు 11.58 శాతం బలపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈలో సైతం ఈ వాటాలు 3.27 శాతం లాభపడి రూ. 14.20గా ట్రేడయ్యాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 7: టాటాస్టీల్ గురువారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత సెప్టెంబర్ మాసంతో ముగిసిన మూడు నెలల కాలానికి బ్యాంకు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎదుగూబొదుగూ లేని స్థితిలో స్వల్ప నష్టాలను ప్రకటించింది. మదుపర్ల సానుకూల సెంటిమెంటును సానుకూలంగా మార్చుకోవడంలో సంస్థ విఫలమైంది. వాటాలు బీఎస్ఈలో 0.30 శాతం నష్టపోయి ఒక్కో వాటా రూ. 403 వంతున ట్రేడవగా, ఎన్ఎస్ఈలో 0.40 శాతం నష్టాలతో రూ.
న్యూఢిల్లీ: వివిధ కారణాలతో అర్ధంతరంగా ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం 25 వేల కోట్ల రూపాయల ఫండ్ను కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కార్పొరేట్ రంగానికి చేయూతనిచ్చే క్రమంలో, అంతకు ముందు బడ్జెట్లో పేర్కొన్న పన్నులను మినహాయించిన కేంద్రం ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి ఉద్దీపన పథకాలను ప్రకటించింది.
విజయవాడ పశ్చిమ, నవంబర్ 6: కోడిమాంసం ధర ఒక్క వారంలోనే కిలోకి రూ. 50 పెరిగింది. గత వారం కిలో స్కిన్లెస్ రూ. 130కి లభించగా నేడు కిలో రూ. 180కి చేరింది. కూరగాయల ధరలూ పెరిగాయి. ఉల్లి ధర ఘాటు మళ్లీ కంటతడి పెట్టిస్తోంది. రైతుబజార్లలో ఉల్లిపాయలు కిలో రూ. 35కి అమ్ముతున్నా గానీ నాసిరకం దొరుకుతున్నాయి. గోళీకాయలంత సైజుల్లో ఉంటున్నాయని వినియోగదారులు విలవిల్లాడుతున్నారు.
షాంఘైలో బుధవారం చైనా అంతర్జాతీయ దిగుమతుల ప్రదర్శనలో వాహనాన్ని నడుపుతున్న రోబో. స్వదేశీ మార్కెట్లో విదేశీ వస్తువుల అమ్మకాలకు చైనా ప్రభుత్వం గత ఏడాది అనుమతించినప్పటికీ దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి.
లండన్, నవంబర్ 6: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను మోసగించి పెద్ద మొత్తంలో రుణం తీసుకొని, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బుధవారం బ్రిటన్లోని ఒక కోర్టు ఎదుట హాజరయ్యారు. నీరవ్ మోదీ బెయిల్ కోసం పెట్టుకున్న తాజా పిటిషన్ను ఈ కోర్టు విచారిస్తోంది. పీఎన్బీని సుమారు 2బిలియన్ డాలర్ల మేరకు మోసగించిన కేసులో నీరవ్ మోదీని తనకు అప్పగించాలని భారత్ బ్రిటన్ను కోరుతోంది.