S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/26/2017 - 07:56

జైగద్ (మహారాష్ట్ర), మార్చి 25: పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్.. తమ సంస్థ జెఎస్‌డబ్ల్యు గ్రూప్ రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో దేశ, విదేశాల్లోని పోర్టుల రంగంలో 7,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టనుందని శనివారం చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టామన్నారు.

03/25/2017 - 01:14

భారతీయ మార్కెట్‌లోకి జపాన్ ఆటోరంగ దిగ్గజం టొయోటా.. తమ లగ్జరీ బ్రాండైన లెక్సస్ కార్లను శుక్రవారం తీసుకొచ్చింది. వీటిలో ఆర్‌ఎక్స్ హైబ్రిడ్ మోడల్ ధర 1.07 కోట్ల రూపాయలుగా ఉంటే, ఆర్‌ఎక్స్ ఎఫ్ స్పోర్ట్ హైబ్రిడ్ మోడల్ ధర 1.09 కోట్ల రూపాయలుగా ఉంది. ఇఎస్ 300హెచ్ హైబ్రిడ్ సెడాన్ ధర 55.27 లక్షల రూపాయలుగా ఉంది. టాప్ ఎండ్ ఎస్‌యువి ఎల్‌ఎక్స్450డి మోడల్‌నూ సంస్థ పరిచయం చేయగా, దీని ధరను మాత్రం ప్రకటించలేదు.

03/25/2017 - 00:52

న్యూఢిల్లీ, మార్చి 24: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) శుక్రవారం 591 కోట్ల రూపాయల జరిమానా విధించింది. బొగ్గు సరఫరా ఒప్పందాల్లో కాంపిటీషన్ నిబంధనల ఉల్లంఘనే ఇందుకు కారణం. ఇంధన సరఫరా ఒప్పందాలు పారదర్శకంగా లేవని, మార్కెట్‌లో ఆరోగ్యకర పోటీతత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తాము గుర్తించామన్న సిసిఐ..

03/25/2017 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 24: వాహనాల ధరలను పెంచుతున్నట్లు వోల్వో ఆటో ఇండియా ప్రకటించింది. వచ్చే నెల ఏప్రిల్ నుంచి తమ అన్ని మోడల్స్‌పై 2 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది. పెరిగిన ఉత్పాదక వ్యయం వల్లే ధరలను పెంచాల్సి వస్తోందని ఓ ప్రకటనలో శుక్రవారం సంస్థ తెలియజేసింది.

03/25/2017 - 00:51

న్యూఢిల్లీ, మార్చి 24: నల్లధన కుబేరులను ఆదాయ పన్ను (ఐటి)శాఖ శుక్రవారం హెచ్చరించింది. ఈ నెల 31తో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎమ్‌జికెవై) పథకం ముగుస్తున్న క్రమంలో నల్లధనం కలిగి ఉన్నవారు తమ అక్రమ సంపద వివరాలను బయట పెట్టాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ప్రకటించింది. తమ వద్ద నల్లధన అక్రమార్కుల ఆర్థిక వివరాలన్నీ ఉన్నాయని చెప్పింది.

03/25/2017 - 00:49

హైదరాబాద్, మార్చి 24: వచ్చే ఏడాది ఐటి రంగంలో కొత్తగా 25 వేల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐటి రంగంపై విడుదల చేసిన పద్దులో ప్రకటించింది. ఈ ఏడాది ఇంతవరకు 15 వేల ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించగా, 65 వేల కోట్లకుగాను ఫిబ్రవరి నాటికి 62 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేసింది.

03/25/2017 - 00:48

హైదరాబాద్, మార్చి 24: డ్రైవర్లు లేకుండా నడిచే వాహనాలు భవిష్యత్‌లో పెద్ద ఎత్తున రాబోతున్నాయని, డ్రైవింగ్ సీట్లో మనిషి లేకుండానే నడిచే కార్లు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయని ఐఐటి మద్రాస్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి వి మణివన్నన్ అన్నారు.

03/25/2017 - 00:46

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ కేటగిరిలోని కాంపోజిట్ పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్ ఉందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ జి బాలమల్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం, టిఎస్‌ఐఐసి తరఫున పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు.

03/25/2017 - 00:45

హైదరాబాద్, మార్చి 24: ఏపి ప్రభుత్వం తరఫున మద్యానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపి బెవరేజ్ కార్పోరేషన్ నుంచి 1,500 కోట్ల రూపాయల సేవా పన్నును వసూలు చేయకుండా సర్వీసు ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

03/25/2017 - 00:44

న్యూఢిల్లీ, మార్చి 24: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) 9 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ 659 కోట్ల రూపాయలు. ఇందులో నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్, వొడాఫోన్ ఎఫ్‌డిఐలు కూడా ఉన్నాయి. నెట్‌మ్యాజిక్ సొల్యూషన్స్ ఎఫ్‌డిఐ విలువే 534 కోట్ల రూపాయలు.

Pages