S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/22/2017 - 00:26

న్యూఢిల్లీ, మార్చి 21: రిటైల్ వ్యాపార విభాగం డీ-మార్ట్ నిర్వహణదారైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు.. మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల లిస్టింగ్ జరగగా, తొలిరోజే షేర్ విలువ ఏకంగా 114 శాతానికిపైగా లాభపడింది. 299 రూపాయల విలువతో స్టాక్ మార్కెట్లలోకి అడుగిడిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్..

03/22/2017 - 00:24

న్యూఢిల్లీ, మార్చి 21: అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. వచ్చే నెల ఏప్రిల్ నుంచి భారతీయ మార్కెట్‌లో తమ స్పెషల్ ‘రెడ్’ ఎడిషన్‌కు చెందిన ఐఫోన్ 7, ఐఫోన్ 7ప్లస్ మోడళ్లను విక్రయించనుంది. ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటానికి గుర్తుగా వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. కాగా, ఇతర దేశాల్లో ఈ నెల 24 నుంచే ఈ మోడల్స్ అందుబాటులో ఉంటాయని యాపిల్ స్పష్టం చేసింది.

03/22/2017 - 00:24

న్యూఢిల్లీ, మార్చి 21: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కార్ల ధరలను పెంచుతోంది. అధిక రవాణా చార్జీలు, పెరిగిన ఉత్పాదక వ్యయం నేపథ్యంలో వచ్చే నెల నుంచి వివిధ మోడళ్ల ధరలను 10,000 రూపాయల వరకు పెంచనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో హోండా కార్స్ తెలిపింది.

03/22/2017 - 00:23

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి, వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టాప్సీ) డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ ఎఫ్‌టాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ టిఎస్ ఐపాస్ విధానంపై అధ్యయనం చేసి 12 సిఫార్సులను చేశారు.

03/22/2017 - 00:20

రియాద్, మార్చి 21: తమ దేశంలోని విదేశీ వర్కర్లపై ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని సౌదీ అరేబియా భావిస్తోంది. తద్వారా సౌదీ కంపెనీలు అక్కడి పౌరులనే ఉద్యోగాల్లోకి తీసుకునేలా చేయాలని చూస్తోంది. సౌదీ పౌరుల్లో పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకే ఈ ఆలోచన అని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

03/22/2017 - 00:20

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రపంచవ్యాప్తంగా నివాసయోగ్యమైన చౌక నగరాల్లో నాలుగు భారతీయ నగరాలున్నాయి. తక్కువ ఖర్చుతో నివాసానికి అనువైన ఈ నగరాల జాబితాలో బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీలకు స్థానం లభించింది. ఎకనామిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ (ఇఐయు) నివేదిక ప్రకారం టాప్-10లో బెంగళూరుకు మూడో స్థానం దక్కగా, చెన్నై ఆరు, ముంబయి ఏడు, ఢిల్లీ 10 స్థానాల్లో నిలిచాయి.

03/22/2017 - 00:18

హైదరాబాద్, మార్చి 21: వచ్చే మూడేళ్లలో 5,880 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను 37,938 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

03/22/2017 - 00:16

ముంబయి, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బ్యాంకింగ్, ఔషధ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33.29 పాయింట్లు కోల్పోయి 29,485.45 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.35 పాయింట్లు పడిపోయి 9,121.50 వద్ద నిలిచాయి. సోమవారం సెనె్సక్స్ 130, నిఫ్టీ 33 పాయింట్ల మేర క్షీణించినది తెలిసిందే.

03/21/2017 - 00:38

న్యూఢిల్లీ, మార్చి 20: వొడాఫోన్-ఐడియా విలీనంతో భారతీయ టెలికామ్ రంగంలో సమీకరణాలు మారిపోయాయ. బ్రిటన్‌కు చెందిన టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్.. ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన టెలికామ్ సంస్థ ఐడియా సెల్యులార్ తమ విలీనాన్ని సోమవారం ప్రకటించాయ. విలీనంతో ఏర్పడే కొత్త సంస్థకు కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

03/21/2017 - 00:36

న్యూఢిల్లీ, మార్చి 20: ఎస్‌బిఐలో భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి) విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎస్‌బిఐలో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం అవుతున్నది తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ శాఖలు వచ్చే నెల 1 నుంచి ఎస్‌బిఐలో కలుస్తున్నాయి.

Pages