-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎపిఎస్డబ్ల్యుసి) మూడేళ్లకుగాను ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయల డివిడెండ్ను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 తోపాటు గడచిన రెండు ఆర్థిక సంవత్సరాలైన 2014-15, 2015-16లకు సంబంధించి ఈ 6 కోట్ల రూపాయల ఇంటీరియం డివిడెండ్ చెక్కును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: గడచిన ఆరు నెలల్లో ప్రభుత్వ, ప్రైవేట్రంగాల నుంచి కోట్లాది రూపాయల ఆర్డర్లు అందుకున్నట్లు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం (కెవిఐసి) శనివారం తెలియజేసింది. ఇందులో 23 కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఉన్నాయని, వాటికి 150 కోట్ల రూపాయల ఖాదీ ఉత్పత్తులను సరఫరా చేశామని చెప్పింది. అలాగే ఒఎన్జిసి (రూ. 52 కోట్లు), రైల్వేలు (రూ. 42 కోట్లు), ఎయిరిండియా (రూ.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో త్వరలో విలీనం కాబోతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ (ఎస్బిటి).. 600 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. దీనికి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి శనివారం ఆమోదం రాగా, ప్రైవేట్ ప్లేస్మెంట్పై బాసెల్-3 ఆధారిత బాండ్ల ద్వారా ఈ నిధులను సేకరించనుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17: నల్లధనం నిర్మూలనకు, వెలికితీతకు పాత పెద్ద నోట్ల రద్దు ఒక్కటే మార్గం కాదని, దాన్ని సర్వరోగ నివారిణిగా భావించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మాజీ గవర్నర్ సి రంగరాజన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ రవీంద్ర భారతిలో అఖిల భారత రిజర్వ్ బ్యాంకు ఉద్యోగ సంఘాల 32వ జాతీయ సమావేశాన్ని రంగరాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి కొత్త చైర్మన్గా ఎన్నికైన అజయ్ త్యాగీ.. పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు తగ్గించింది. యుకె సిన్హా స్థానంలో ఐదేళ్లకుగాను త్యాగీని కేంద్రం ఎంచుకున్నది తెలిసిందే. అయితే ఇప్పుడు మూడేళ్లకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. 58 ఏళ్ల త్యాగీ.. హిమాచల్ప్రదేశ్ కేడర్కు చెందిన 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్ను సమర్పించడానికి వచ్చే నెల 31వరకు గడువిచ్చింది ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్ఒ. ఇంతకుముందు ఈ నెల 28 వరకే ఈ గడువుండగా, దీన్ని మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు తాజాగా తెలిపింది. ఇపిఎఫ్ఒ పథకాల ప్రయోజనాలు అందడానికి ఆధార్ నెంబర్ను తప్పనిసరి చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దాదాపు సాధారణ పరిస్థితులను తెచ్చామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ సిఎన్బిసి-టివి18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రద్దయిన పాత కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీని తెచ్చే ప్రక్రియ వేగంగా, విజయవంతంగా జరుగుతోందన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలదన్న విశ్వాసాన్ని పారిశ్రామిక సంఘం అసోచామ్ వ్యక్తం చేసింది. ఆన్లైన్ పేమెంట్లు పెరుగుతుండటమే దీనికి కారణమంది. ‘ప్రభావవంతమైన సంస్కరణలతో ముందడుగేస్తున్న భారత్’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ మేరకు అభిప్రాయపడింది.
ముత్తుకూరు, ఫిబ్రవరి 17: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు అభివృద్ధిలో భాగంగా వచ్చే ఏడాది నాటికి నాలుగు లక్షల కంటైనర్ల కార్గో రవాణా ఎగుమతి, దిగుమతిని లక్ష్యంగా పెట్టుకున్నామని కృష్ణపట్నం పోర్టు సిఇఒ యండ్లూరి అనిల్కుమార్ వెల్లడించారు.
శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన అంతర్జాతీయ మదుపరుల సదస్సు-2017లో విలేఖరులతో మాట్లాడుతున్న ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ