-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఉచిత డేటా, కాల్స్ సదుపాయాలతో దేశీయ టెలికామ్ రంగంలో దూసుకెళ్తున్న సంచలన సంస్థ రిలయన్స్ జియో.. 4జి ఇంటర్నెట్ వేగం సగానికి పడిపోయింది. టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశీయ టెలికామ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న భారతీ ఎయిర్టెల్ ఇంటర్నెట్ వేగం బాగుందని చెప్పింది.
ముంబయి, ఫిబ్రవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 5 నెలల గరిష్ఠ స్థాయిని తాకగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మరోసారి 8,800 మార్కును అధిగమించింది. సెనె్సక్స్ 167.48 పాయింట్లు ఎగిసి 28,468.75 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 43.70 పాయింట్లు అందుకుని 8,821.70 వద్ద నిలిచింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17: దేశీయ ప్రైవేట్రంగ టెలికామ్ సంస్థ ఎయిర్సెల్ తొలిసారిగా డయలర్ ట్యూన్ ఫేస్బుక్ సర్వీసును ఆవిష్కరించింది. ఐఎంఎ మొబైల్ సహకారంతో సంగీత ప్రేమికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయడం ద్వారా ఎయిర్సెల్ కస్టమర్లు డయలర్ ట్యూన్స్ పొందడంతోపాటుగా ఫేస్బుక్ మెస్సెంజర్ ద్వారా సులుభంగా యాక్టివేట్ చేసుకోవచ్చని ఆ సంస్థ చీఫ్మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ తెలిపారు.
రాంచీ, ఫిబ్రవరి 16: అవినీతి, రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడ్డ జార్ఖండ్ జాతీయ సగటుకు ఎగువగా 4.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అపారమైన సహజ వనరుల సంపద, పెట్టుబడులకు అవకాశాలు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయని జాతీయ సగటు కంటే కూడా వీటన్నింటి కారణంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కనీసం 4-5 శాతం ఎగువనే ఉంటుందని తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పట్టుమని ఏడేళ్లు కూడా లేని ఓ పాప ఉద్యో గం కావాలని అడిగిందంటే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా స్కూల్లో చేరిందో లేదో తెలియదు కాని బ్రిటన్కు చెందిన షోలే బ్రిడ్జివాటర్ అనే ఏడేళ్ల బాలిక ఏకంగా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్కే ఉద్యోగం కావాలంటూ లేఖ రాసింది.
ముంబయి, ఫిబ్రవరి 16: గత కొన్ని రోజులుగా నష్టాల బాటలో పడ్డ సెనె్సక్స్ గురువారం గట్టిగా పుంజుకుంది. లావాదేవీలు ముగిసే సమయానికి 146 పాయింట్లు సాధించి 28,301 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటి, ఫార్మా సంస్థలు నేటి లావాదేవీల్లో గణనీయంగా లాభపడ్డాయి. ముఖ్యంగా షేర్ల బైబ్యాక్ ప్రతిపాతనను వచ్చేవారి ప్రతిపాదిస్తామంటూ టిసిఎస్ సంస్థ చెప్పడంతో ఐటి షేర్లను ఇనె్వస్టర్లు దృష్టి సారించారు.
రాంచీ, ఫిబ్రవరి 16: రద్దయిన నోట్ల పునరుద్ధరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నగదు లభ్యతకు సంబంధించి మామూలు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. దైనందిన వారీగా నగదు లభ్య అంశాన్ని రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతంగా పంపడం వెనుక ఎల్ అండ్ టి ఏరోస్పేస్ విభాగం కూడా కీలక పాత్ర పోషించింది. తమ సంస్థలో భాగంగా ఉన్న ఏరోస్పేస్ విభాగం ఈ ప్రయోగంలో కీలక సేవలను అందించిందని ఎల్అండ్టి సంస్థ స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా ఇస్రో సాధించిన ఘనవిజయంలో తాము కూడా పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పెద్దనోట్ల రద్దు అనంతరం జరిగిన వందలాది కోట్ల రూపాయల డిపాజిట్లపై ఆదా యం పన్ను విభాగం దృష్టి పెట్టింది. గత కొన్ని వారాలుగా ఈ డిపాజిట్ల తీరుతెన్నులను పరిమాణాన్ని లోతు గా విశే్లషించిన ఐటి విభాగం మొత్తం 9 లక్షల ఖాతాలు అనుమానాస్పదమైనవేనని వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పెద్దనోట్ల రద్దు అనంతరం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలవల్ల స్థూల జాతీయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. స్థూల జాతీయ ఉత్పత్తిపై పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.