S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/19/2019 - 01:49

మేడ్చల్, ఏప్రిల్ 18: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న నల్లవల్లి దేవేందర్ (30) 16వ తేదీన మందుల కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన భార్య అనురాధ తేలిసినచోట, బంధువులు, స్నేహితుల వద్ద దేవేందర్ ఆచూకీ కోసం ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది.

04/19/2019 - 01:49

తలకొండపల్లి, ఏప్రిల్ 18: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన తాండ్ర మల్లేష్(19), భాషమోని శిల్ప(17) ప్రేమ జంట బుధవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తలకొండపల్లి ఎస్సై సురేష్ యాదవ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే కులానికి చెందిన మల్లేష్, శిల్ప గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

04/19/2019 - 01:48

బొంరాస్‌పేట, ఏప్రిల్ 18: తన కొడుకులు తినడం లేదని వారిని కొడుతుండగా అన్న వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా కోపంలో అతని తలపై తమ్ముడు కొట్టడంతో బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, అన్నకు జరగరానిది ఏమైనా జరిగితే తన పరిస్థితి ఏమిటని భావించిన తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన మండల పరిధిలోని దుద్యాల గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట శ్రీను కథనం ప్రకారం...

04/19/2019 - 01:48

ఉప్పల్, ఏప్రిల్ 18: ఉప్పల్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతిచెందాడు. సీఐ కథనం ప్రకారం రామంతాపూర్‌కు చెందిన రామావత్ హరినాయక్(35) ఉప్పల్‌కు వస్తుండగా చౌరస్తాలో జనగాం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

04/19/2019 - 01:47

ఘట్‌కేసర్, ఏప్రిల్ 18: ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని నగలు, నగదు చోరీకి పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి గాంధీనగర్‌లో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న డీ.వాసుర్బి ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. బుధవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది.

04/19/2019 - 01:31

హైదరాబాద్: బెంగలూరులో నివాసం ఉంటున్న బీ మహేష్ అనే వ్యక్తిని అరెస్టు చేయడంలో జాప్యంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా సోమవారం నాడు హాజరు కావాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ గురువారం నాడు కర్నాటక డీజీపీని ఆదేశించింది. మహేష్ భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేష్‌ను అరెస్టు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలుచేయలేదని కోర్టు ప్రశ్నించింది.

04/18/2019 - 23:47

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 18: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, పోలీసు బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు సహా ఇద్దరు మావోలు హతమయ్యారు. మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. రెండవ విడత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్, రాజ్‌నందన్‌గామ్, మహాసముంద్ లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది.

04/18/2019 - 23:46

నగరి / మదనపల్లె /పెద్దారవీడు, ఏప్రిల్ 18: చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో గురువారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఒక యువతి మృతి చెందగా, మదనపల్లె మండలంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో తల్లీ బిడ్డ మృతి చెందారు.

04/19/2019 - 03:20

చౌటుప్పల్, ఏప్రిల్ 18: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద బుధవారం రాత్రి ప్రత్యేక పోలీసు బృందం జరిపిన తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల రూపాయల విలువ చేసే 11 క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్ డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ అధికారులు పక్కా సమాచారం మేరకు కాపుకాసి గంజాయిని పట్టుకున్నారు.

04/18/2019 - 23:09

నడిగూడెం, ఏప్రిల్ 18: పిడుగుపాటుతో కూలీ మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Pages