-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కొత్తకోట, ఏప్రిల్ 18: డ్రైవర్ ఆజాగ్రత్త వల్ల కావేరి బస్సు బోల్తా పడిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కావేరి బస్సు మండల పరిధిలోని విలీయంకొండ సబ్స్టేషన్ సమీపంలో బస్సు బోల్తా పడింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ వారం రోజుల పాటు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీలోని ఒక కోర్టు గురువారం కొట్టివేసింది. కుటుంబంతో కలిసి ఈస్టర్ వేడుకలు జరుపుకోవడానికి తాత్కాలిక బెయిలు ఇవ్వాలని కోరుతూ క్రిస్టియన్ ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు.
నడిగూడెం, ఏప్రిల్ 17: ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యం వారికి అందకుండా దళారులకు వరంగా మారి రిసైక్లింగ్ చేస్తూ సుమారు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన సంఘటనన బుధవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని వేణుగోపాలపురంలో చోటుచేసుకుంది.
అమీన్పూర్, ఏప్రిల్ 17: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నడండ్రే తమ పాలిట కాలయముడవుతాడని ఆ చిన్నారులకు తెలియలేదు.. నిద్రలోనే తమ జీవితం తెల్లారిపోతుందని ఉహించలేదు. విచక్షణ కోల్పోయిన ఆ ఉన్మాది ఒక్క వేటులో పిల్లల్లో ఒకరిని కత్తితో పొడిచి చంపగా, మరొకరిని తాడుతో ఉరి బిగించి హత్య చేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్ పట్టణంలోని బాంబే కాలనీలో బుధవారం ఉదయం వెలుగు చూసింది.
గణపురం, ఏప్రిల్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. ఇద్దరు వృద్ధులపై దాడి చేయగా జూకంటి సమ్మయ్య (85) అక్కడికక్కడే మృతి చెందగా మరో వృద్ధురాలు బోల్ల రాజమ్మ, గాయాలతో బయటపడింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. చెల్పూరు గ్రామానికి చెందిన జూకంటి సమ్మయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
తిరుపతి, ఏప్రిల్ 17: తిరుమల మొదటి ఘాట్రోడ్డులో వేగంగా వస్తున్న జీపు, మోటార్సైకిల్ను ఢీకొనడంతో స్కూటరిస్టు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలో నివాసం ఉంటూ తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్లోని ఓ దుకాణంలో బలరాం అనే వ్యక్తి దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.9లక్షలకు పైగా విలువ చేసే 236 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం పోలీస్టేషన్ పరిధిలోని గూడవల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చిన ఓ వాహనంలో సోదాలు చేయగా భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
జీడిమెట్ల, ఏప్రిల్ 17: భర్త వేధింపులు తాళలేక ఓ భార్య అదృశ్యమైన సంఘటన దుందిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సూరారం కాలనీ, కృష్ణానగర్లో నివాసముండే లచ్చిరామ్, లలితాబాయి దంపతులు. లచ్చిరామ్ ప్రతిరోజు మద్యం సేవించి లలితా బాయిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు.
కొత్తూరు రూరల్, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తూరు మండల కేంద్రంలోని చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ కృష్ణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఆటో కొత్తూరు 44వ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో ఆటో డ్రైవర్ యాదగిరి (26) అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17: బేగంబజార్ పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం పండ్ల గోదాములో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనలో భారీగా ఆస్తి నష్టం కలిగింది. ప్రాణ నష్టం కలుగలేదు. సకాలంలో సంఘటన స్థలికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపు చేయడంతో ప్రక్కనే ఉన్న ఇతర షాపులకు మంటలు తగులకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ ముప్పు తప్పింది.