S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/24/2018 - 23:36

సోమవారం కలెక్టర్ సమక్షంలో జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో నగర పరిధిలోని నిజాంపేటకు చెందిన నిరుద్యోగి జూగటి సాంబయ్య తన వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. 2012లో కోర్టులో తాను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు కాకుండ ఇతరులకు అటెండర్ ఉద్యోగం కేటాయించారని, అనేక దఫాలు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు.

09/24/2018 - 23:30

కారంపూడి, సెప్టెంబర్ 24 : స్నేహితుడిని కాపాడటానికి వెళ్లి నాగార్జునసాగర్ కుడికాలువలో ఆదివారం గల్లంతైన కారంపూడి పోలీస్ కానిస్టేబుల్ పత్తిపాటి ఆనంద్‌కుమార్ (30) మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. గత 32 గంటల నుండి కారంపూడి సాగర్ కాలువ వద్ద నుండి ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈత గాళ్లు బృందాలుగా విడిపోయి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

09/24/2018 - 23:18

కామారెడ్డి, సెప్టెంబర్ 24 అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన కిష్టమ్మగారి రవిందర్ గౌడ్ (38) అనే యువ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని భార్య భాగ్యమ్మ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

09/24/2018 - 23:17

నవీపేట, సెప్టెంబర్ 24: వినాయక ఉత్సవాల్లో భాగంగా 11రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని గోదావరిలో నిమజ్జనం చేసేందుకు అత్యంత భక్తిశ్రద్దలతో శోభాయాత్ర నిర్వహించగా, జనరేటర్‌తో ఏర్పడిన విద్యుదాఘాతంతో మృత్యు ఒడిలోకి చేరిన సంఘటన నవీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నవీపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

09/24/2018 - 22:57

చాపాడు, సెప్టెంబర్ 24: మండలంలోని సీతారామపురం గ్రామంవద్ద సోమవారం పాత బ్రిడ్జీపై నుంచి కుందూనదిలోకి రత్న అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దూకిందని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలం ఖాదరబాద్ గ్రామానికి చెందిన కావుగాల్ల రత్న కుటుంబ మనస్పర్థలతో చాపాడు మండలం సీతారామపురం గ్రామానికి చేరుకుని ఆ నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించింది.

09/24/2018 - 22:36

సామర్లకోట, సెప్టెంబర్ 24: విశాఖపట్నం వైపు వెడుతున్న స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కబోతూ రైలు బోగి ఢీకొని కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి ఉదంతం ఇది. సామర్లకోట రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

09/24/2018 - 22:17

నర్సీపట్నం, సెప్టెంబర్ 24: ఏజన్సీ నుండి మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీ ఐ సింహాద్రినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం పట్టణ పొలిమేర్లలో వాహనాల తనిఖీ చేస్తుండగా చింతపల్లి వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి బ్యాగ్‌లు పరిశీలించగా గంజాయిని గుర్తించామన్నారు.

09/24/2018 - 22:00

కళ్యాణదుర్గం, సెప్టెంబర్ 24: మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన చిత్రావతి(51) కుటుంబ సమస్యలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన సంఘటనపై పోలీసులకు ఆలస్యంగా సమాచారం రావడంతో రాత్రిపోయి శవాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు.

09/24/2018 - 21:01

అడ్డగూడూరు సెప్టెంబర్ 24: వినాయక నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. మండలం పరిధిలోని చౌళ్లరామారంలో ఆదివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో జంపల అనిల్ (18) విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. శోభాయాత్రలో సౌండ్‌సిస్టమ్ కోసం విద్యుత్ సరఫరా చేస్తుండగా ప్రమదవం జరిగింది. దీంతో అనిల్‌ను తొర్రూరు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

09/24/2018 - 21:01

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 24: మండలంలోని అప్పాజిపేట గ్రామంలో అప్పుల బాధతో సోమవారం రైతు గంగుల మల్లయ్య (57) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్‌ఐ మురళీగౌడ్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గంగుల మల్లయ్య తనకున్న మూడున్నర ఎకరాల చెల్కలో పత్తిపంటను సాగు చేస్తుండగా వర్షాభావంతో పంట దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Pages