S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/24/2018 - 05:06

విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 23: సీనీ పక్కీ తరహాలో ఓ బంగారం వ్యాపారి కంట్లో కారం జల్లి రూ.32లక్షల నగదు, 1200గ్రాముల బంగారాన్ని మోటారుబైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు అపహరించుకుపోయారు. నగరంలోని డిఆర్‌ఎం కార్యాలయం రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

09/24/2018 - 04:39

గోకవరం, సెప్టెంబర్ 23:సూదికొండ రిజర్వు పారెస్టులో వన్య ప్రాణులను వేటాడేందుకు వేటాగాళ్లు అమర్చిన బైండింగ్ వైరుకు విద్యుత్ అమర్చిన తీగలకు యువకుడు బలి అయిన సంఘటన ఆదివారం గోకవరం మండలంలో పలు అనుమానాలకు తావిస్తోంది.

09/24/2018 - 03:36

బాపట్ల, సెప్టెంబర్ 23: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని నందిరాజుతోట గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు సమీపంలోని చెరువులో మునిగి మృతి చెందారు. నందిరాజుతోట గ్రామాన్ని శోకసంద్రంలో ముంచిన ఈ విషాద సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. నందిరాజుతోట గ్రామానికి చెందిన ఉప్పాల ప్రసాద్ కుమారుడు సాయి(10), కేసన శ్రీనివాసులు కుమారుడు మణికంఠ(11) కలసి ఆడుకుంటూ వల్లువారిపాలెం చెరువులోకి దిగారు.

09/24/2018 - 02:53

తిరుమలసాగర్, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లా తిరుమలసాగర్ మండలంలోని బోయగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకొంది. వినాయక విగ్రహం మీద పడటంతో బులిగొర్ల రామకృష్ణ (8) దుర్మరణం చెందాడు. శోభాయాత్రలో 12 అడుగుల విగ్రహానికి చెట్టుకొమ్మ తగలడంతో విగ్రహం ట్రాక్టర్ మీద నుంచి కిందకు జారి బాలుడి మీద పడింది. దీంతో రామకృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు.

09/24/2018 - 02:36

పాల్వంచ, సెప్టెంబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని బాపూజీనగర్‌లో నివాసముంటున్న లిఖిత స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కేటీపీఎస్ ఇంటర్మీడియట్ కాలనీలో నివాసం వుంటున్న మణికంఠతో లిఖిత ప్రేమలో పడింది.

09/24/2018 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఎన్నికల సమయంలో మీడియాలో ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి చేసిన సేవ గురించి గొప్పలు చెబుతూ ప్రచురితమయ్యే వార్తలను పెయిడ్ న్యూస్‌గా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మంత్రి నరోత్తమ్ మిశ్రాపై పెయిడ్ న్యూస్‌కు సంబంధించి వచ్చిన అభియోగాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

09/24/2018 - 00:35

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: అందరూ వినాయక నిమజ్జనం సంబురాల్లో మునిగితేలుతుండగా ఇద్దరి కుటుంబాల్లో మాత్రం విద్యుదాఘాతం విషాదాన్ని నింపింది. ఆకుంటుంబాల దోదన అందరినీ కన్నీటిపర్యంతం చేసింది. తల్లిదండ్రులకు కొరిమిపెట్టాల్సిన కొడుకుకు తామే కొరివి పెట్టాల్సి వచ్చిన దుస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు రోదనను ఎవరూ ఆపిన వారి కడుపుకోత ఎవరూ తీర్చలేని దుఖం వారిది.

09/24/2018 - 00:11

చిలుకూరు, సెప్టెంబర్ 23: నవమాసాలు మోసి కడకు పుట్టిన పసికందును తల్లి ప్రేమ రుచిచూడక ముందే ఓ ఇంటి వెనుక వదిలివెళ్లిన సంఘటన మండలంలోని బేతవోలు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బేతవోలుకు చెందిన కందరబోయిన శ్రీను ఇంటి వెనుకాల గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా మరుగుదొడ్డి వద్ద పసికందును వదిలివెళ్లారు.

09/23/2018 - 06:27

పుట్టపర్తి, సెప్టెంబర్ 22 : పుట్టపర్తి పట్టణానికి చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. స్థానిక సాయినగర్ కాలనీకి చెందిన యశ్వంత్ (12) సమీపంలోని హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లాడు. 7వ తరగతి చదువుతున్న యశ్వంత్ నీట మునిగి మృతి చెందడంతో సమీపంలోని ప్రజలు గుర్తించారు. ఈతకు వెళ్ళిన ఒడ్డుకాడ చెప్పులు, బట్టలు ఉండడాన్ని గమనించి వెతకడం మొదలుపెట్టారు.

09/23/2018 - 06:02

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 22:నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఓ అవినీతి బిల్ కలెక్టర్ శనివారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాలు.. జహంగీర్ ఖాశీం అనే వ్యక్తి నగరంలోని బాలాజీనగర్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటిని తన పేరు పైకి మార్చుకునేందుకు నగర పాలక సంస్థ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఎస్‌ఎండీ షరీఫ్‌ను కలిశాడు.

Pages