S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/03/2017 - 23:31

న్యూఢిల్లీ, ఆగస్టు 3: తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏ స్థాయిలో ఉన్నా కృషి చేస్తానని ఎన్డీయే ఉపరాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం నాడు ఎన్డీయే ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయడు తన నివాసంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో భేటి అయ్యారు. టిడిపి, టిఆర్‌ఎస్, వైకాపా,బిజెపి పార్లమెంట్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

08/03/2017 - 02:20

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఆరు జాతీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించడానికి ముగ్గురు సభ్యులుతో కూడిన విస్తృత బెంచ్‌ను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్‌కె మాధుర్ ఏర్పాటు చేశారు. శ్రీ్ధర్ ఆచార్యుల సారధ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ స్థానే ఇది పనిచేస్తుంది 2016 జూలై 22 నుం చి బెంచ్ పనిచేస్తుండగా పనివత్తిడి వల్ల కొనసాగలేనని బిమల్ జుల్కా తెలిపారు.

08/03/2017 - 02:20

ముంబయి, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పడంతో పాటు గా ప్రభుత్వం నిధుల ఖర్చు నాణ్యత నీరుగారిపోతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) బుధవారం అభిప్రాయ పడింది. దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌తో పాటు గా కర్నాటక, పంజాబ్, మహారాష్టల్రు ఇటీవల వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించడం తెలిసిందే.

08/03/2017 - 02:20

పాట్నా, ఆగస్టు 2: బిహార్‌లోని అధికార జెడియులో చీలిక రాబోతుందా? తాజా రాజకీయ పరిణాలు పరిశీలిస్తే అదే నిజమని అనిపిస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మహాకూటమి నుంచి వైదొలగి బిజెపితో జతకట్టడాన్ని జెడియు అగ్రనేత శరద్‌యాదవ్‌కు ఏమాత్రం ఇష్టం లేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ యాదవ్ సారధ్యంలో కొత్త పార్టీ ఏర్పాటవుతుందని కథనాలు వెలువడుతున్నాయి.

08/03/2017 - 02:19

న్యూఢిల్లీ,ఆగస్టు 2: బెంగళూరులో ఉంటున్న గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులను భయాందోళనకు గురిచేసేందుకే ఆదాయం పన్ను శాఖ అధికారులు కర్నాటక మంత్రి శివకుమార్ నివాసం, ఇతర కార్యాలయాలపై దాడులు చేశారనటం ఎంత మాత్రం నిజం కాదని కేంద్ర ఆర్థిక,రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు.

08/03/2017 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 2: తూర్పు రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలుగా కృషిచేస్తుందని, పశ్చిమ ప్రాంతంలోని రాష్ట్రాలతో సమానంగా ఇది అభివృద్ధి చెందేలా దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడిక్కడ స్పష్టం చేశారు.

08/03/2017 - 02:18

ముంబయి, ఆగస్టు 2: ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్ (94)బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా బుధవారం ఇక్కడ లీలావతి ఆసుప్రతిలో చేరారు. డిహైడ్రేషన్, మూత్రకోశ సంబంధిత సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరారని ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరమేమీ కాదని సమీప బంధువుఒకరు తెలిపారు. దిలీప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఐసియూలే ఏమీ లేరని వెల్లడించారు.

08/03/2017 - 01:50

న్యూఢిల్లీ, ఆగస్టు 2: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం నెలాఖరుకు కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేపట్టేందుకు ప్రధాని మోదీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో జరిగే లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణకు మోదీ యోచిస్తున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.

08/03/2017 - 01:50

బెంగళూరు, ఆగస్టు 2: కర్నాటక విద్యుత్ మంత్రి డికె శివకుమార్ ఆస్తులపై బుధవారం పెద్దఎత్తున ఐటి అధికారులు దాడులు జరిపారు. పన్ను ఎగవేత కేసులో భాగంగా జరిపిన దాడుల్లో రూ.9 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటి బృందం వెల్లడించింది. నగదును లెక్కించడం కోసం ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఎన్‌క్లేవ్, కర్నాటకలోని హాసన్, మైసూరు నుంచి నోట్ల లెక్కింపు యంత్రాలను తెప్పించినట్టు అధికారులు వెల్లడించారు.

08/03/2017 - 01:49

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ప్రస్తుత సాంకేతిక యుగంలో వ్యక్తిగత వివరాల గోప్యతను పరిరక్షించడమన్నది గెలవలేని యుద్ధమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఆందోళన కలిగిస్తున్నాయని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

Pages