-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఆగస్టు 1: నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 31తో పనగరియా పదవీకాలం ముగియనుంది. దీనికి ముందే ఆయన రాజీనామా చేస్తున్నటుట ప్రకటించారు. 2014లో ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసిన ప్రధాని నరేంద్ర మోదీ దాని స్థానే నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. దానికి తొలి ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగరియా(62)ను నియమించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికల్లా వంటగ్యాస్పై సబ్సిడీని ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా మంగళవారం సిలిండర్ ధర రెండు రూపాయలు పెరిగింది. తాజా పెంపుదల ప్రకారం ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రేటు రూ.477.46నుంచి రూ.479.77కు పెరుగుతుందని ఐఓసి తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేవలం ఆధార్ ఆధారంగా వ్యక్తుల వ్యక్తిగత వివరాలపై నిఘా పెట్టడం సాధ్యంకాదని యుఐడిఎఐ మంగళవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. దేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేసే ఈ సంస్థ‘ఆధార్ను నిఘా కోసం వాడుకునేందుకు ఎంతమాత్రం వీలులేదు. వ్యక్తుల వ్యక్తిగత వివరాలను కాపాడేందుకు చట్టంలో ఎన్నో రక్షణ కవచాలున్నాయి. అలాగే ఇందుకు సంబంధించిన బలమైన వ్యవస్థలూ ఉన్నాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించకుండా తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల శాసన సభల సీట్లను పెంచడం 2026 సంవత్సరం వరకు సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ తేల్చి చెప్పారు.
న్యూఢిల్లీ, జూలై 31: రానున్న 20 ఏళ్లలో భారత్ కొత్తగా 2,100 విమానాలను కొనుగోలు చేస్తుందని, ఇందుకోసం దాదాపు 290 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని భావిస్తున్నామని అమెరికా ఏరోనాటిక్ దిగ్గజం ‘బోయింగ్’ పేర్కొంది. విమానాల కొనుగోలు విషయంలో భారత్కు సంబంధించి ఇదే అతిపెద్ద అంచనా అని ఆ సంస్థ వెల్లడించింది.
జోధ్పూర్, జూలై 31: పాకిస్తాన్లో సుమారు రెండు శాతం ఉన్న పాకిస్తాన్ హిందువులు ఇప్పటికీ నరకాన్ని అనుభవిస్తున్నారు. దశాబ్దాల తరబడి పాకిస్తాన్లో హిందువులు సరిహద్దులు దాటి భారత్కు వలస వస్తూనే ఉన్నారు. బ్రిటిష్ వారినుంచి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా మానవ చరిత్రలో ఈ అతిపెద్ద వలస కొనసాగుతూనే ఉంది.
ఉత్తరాఖండ్, జూలై 31: భారత్ భూభాగంలోకి చైనా మళ్లీ చొచ్చుకొచ్చింది. విస్తరణ దాహంతో పేట్రేగిపోతున్న డ్రాగన్లు ఈసారి ఉత్తరాఖండ్లోని బారాహోటి సరిహద్దులో కిలోమీటరు మేరకు లోపలికి చొచ్చుకు వచ్చింది. అక్కడ గొర్రెలు, పశువులను మేపుతున్న కాపరులను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపొమ్మని బెదిరించింది.
న్యూఢిల్లీ, జూలై 31: దేశంలో గోరక్షణ పేరుతో పెరిగిపోతున్న దాడులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ ప్రోత్సహంతోనే గోసంరక్షకుల హింసాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ తరహాదాడులు మితిమీరిపోయాయని ఆయన విమర్శించారు.
ముంబయి, జూలై 31: కష్టాలన్నీ కలిసొస్తాయన్న చందంగా మారింది ముంబయికి చెందిన వినోద్ తక్ పరిస్థితి. బ్యాంకు లోను తీసుకుని కొన్న ఫ్లాట్ గతవారం కుప్పకూలి అందులో నివాసం ఉంటున్న తల్లి ప్రమీలా తక్ (55), వదిన అమృత తక్ (30), మూడునెలల పాప విరోనిక మృతిచెందారు. ఇప్పుడు లోను నెలసరి వాయిదా కట్టమని బ్యాంకువారి ఒత్తిడి.. ఎటూ పాలుపోని పరిస్థితిలో వినోద్ తక్ ఉన్నాడు.
న్యూఢిల్లీ, జూలై 31: బీహార్లో మహా ఘట్బంధన్ను చీల్చి బిజెపితో జెడియు జతకట్టడం దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో జెడియు, ఆర్జేడీ కాంగ్రెస్ల మహాకూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారని, కానీ ఈ సంకీర్ణం విచ్ఛిన్నం కావటం బాధకరంగా ఉందని ఆయన సోమవారం వ్యాఖ్యానించారు.