-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
ముంబయి: నిన్న మూడునెలల కనిష్టానికి తగ్గిన బంగారం ధర నేడు కాస్త పెరిగింది. 99.9 స్వచ్ఛత గల బంగారం పది గ్రాముల ధర నిన్నటిమీద 80 రూపాయల మేరకు పెరిగింది. ప్రస్తుతం పదిగ్రాములు 27,130 రూపాయలు ధర పలుకుతోంది. ఇక వెండి ధర నిన్నటికన్నా పది రూపాయలు తగ్గి కిలో 34వేల840 రూపాయలవద్ద స్థిరపడింది.
దిల్లీః జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ జనరల్ కెవి కృష్ణారావు శనివారం ఉదయం కన్నుమూశారు. దిల్లీకి సమీపంలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగువాడిగా సైనిక దళంలో ఉన్నత స్థానాన్ని అలంకరించి ఆయన కీలక బాధ్యతలను నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఆయన మరణం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 29: భారత ప్రధాని లేదా ఆర్థిక మంత్రి పారిశ్రామికవేత్తలను వ్యక్తిగతంగా కలవ వచ్చా? రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తాజాగా విడుదలైన తన ఆత్మకథలో ఈ ప్రశ్న వేశారు. అంతేకాదు పారిశ్రామిక వేత్తలతో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తాను జరిపిన సమావేశాలు చాలా ముఖ్యమైనవని పేర్కొనడం ద్వారా ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం కూడా చెప్పారు.
న్యూఢిల్లీ, జనవరి 29: దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సబ్సిడీలను తొలగించాలన్న ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదన్నారు. వీటిని లక్ష్యిత వర్గాలకే ఉపయోగ పడేలా సహేతుక విధానాన్ని తీసుకొస్తామన్నారు. అనవసర నియంత్రణలు, వక్రీకరణలు తొలగిస్తామని తెలిపారు.
తిరువనంతపురం, జనవరి 29: సౌర విద్యుత్ కుంభకోణంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ముఖ్యమంత్రితో పాటు విద్యుత్ మంత్రి ఆర్యదన్ మొహమ్మద్పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలుకు విజిలెన్స్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ముంబయి, జనవరి 29: ప్రముఖ సినీ నటి, బిజెపి ఎంపి హేమమాలినికి అతి తక్కువ ధరకు ప్రభుత్వ భూమిని కేటాయించడంపై వివాదం రాజుకుంది. ముంబాయి లాంటి మహానగరంలో అతి తక్కువ ధరకు భూమిని కట్టబెట్టడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీఐ దరఖాస్తుతో కేటాయింపు వ్యవహారం వెలుగుచూడటంతో రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. హేమమాలిని స్థాపించబోయే నాట్యవిహార్ కళా కేంద్రానికి రెండువేల చ.మీ.
నేపీడా, జనవరి 29: మయన్మార్లో సైనిక పాలనకు శుక్రవారంతో శాశ్వతంగా తెరపడింది. సైనిక ప్రతినిధులతో నిండిన పార్లమెంటు చివరి రోజయిన శుక్రవారం నాడు మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్సాన్ సూకి పాత పార్లమెంటు సభ్యులందరినీ అనినందించారు.
నాసిక్, జనవరి 29: మహారాష్టల్రోని అహ్మద్నగర్ శని శింగ్నాపూర్ ఆలయం, ముంబయి హాజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షల కథనాలు కలకలం రేపుతుండగా తాజాగా త్రింబకేశ్వర్ ఆలయం వార్తల్లోకి ఎక్కింది. ప్రసిద్ధ త్రికంబేశ్వర్ ఆలయంలోనూ లింగ వివక్ష కొనసాగుతోంది. ఈ ఆలయం నాసిక్కు 30 కిలోమీటర్ల దూరంలో నెలకొంది. దేశంలోని ప్రముఖ శివాలయాల్లో త్రికంబేశ్వర్ దేవాలయం ఒకటిగా వెలుగొందుతోంది.
న్యూఢిల్లీ, జనవరి 29: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం ఆటవీ హక్కుల చట్టాన్ని సవరించటం ద్వారా గిరిజనులకు తీరని అన్యాయం చేస్తూ బడా పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ, జనవరి 29: ప్రమాదకరమైన జికా వైరస్ భారత్కు వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక టెక్నికల్ గ్రూప్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. జికా వైరస్ను ఆదిలోనే కనిపెట్టే నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడంపైనా ఈ సాంకేతిక బృందం దృష్టి పెడుతుంది.