S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/29/2016 - 08:05

విజయపుర (కర్నాటక), జనవరి 28: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతుంటే కర్నాటకలోని ఓ జైల్లో మాత్రం ఐటం సాంగ్ హోరెత్తింది. ఖైదీల విడుదలను పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఐటం సాంగ్ ప్రదర్శించడం వివాదం సృష్టించింది. జైలు అధికారుల నిర్వాకం టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో బాధ్యులైన ముగ్గుర్ని సస్పెండ్ చేశారు.

01/29/2016 - 08:04

న్యూఢిల్లీ, జనవరి 28: ప్రపంచంలోని అత్యంత సంపన్నులయిన 50 మందిలో ముగ్గురు భారతీయులు- ముకేశ్ అంబానీ, అజీం ప్రేమ్‌జీ, దిలీప్ శాంఘ్వీ నిలిచారు. అమెరికాకు చెందిన ఐటి దిగ్గజం బిల్‌గేట్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. బిజినెస్ ఇన్‌సైడర్‌తో కలిసి వెల్త్-ఎక్స్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 24.8 బిలియన్ డాలర్ల ఆస్తులతో ముకేశ్ అంబానీ 27వ స్థానంలో నిలిచారు.

01/29/2016 - 08:03

న్యూఢిల్లీ, జనవరి 28: తన జీవితంలో ఎన్నో గడ్డుసమస్యలను, ప్రతికూల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అమృతంలాంటి రాజ్యాంగాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. దేశ నిర్మాణంలోనూ జాతి నిర్మాణంలోనూ అంబేద్కర్ నిరుపమాన సేవలను అందించారని పేర్కొన్నారు.

01/29/2016 - 06:52

న్యూఢిల్లీ, జనవరి 28: తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడమే కాక మరెన్నో పదవులు నిర్వహించిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన అనుభవాలకు అక్షర రూపం కల్పించారు. అయోధ్య వివాదం మొదలుకొని తాను ప్రధాని కావాలని అనుకున్నట్లు వచ్చిన దుష్ప్రచారం దాకా ఎన్నో అంశాలపై తన మనసులోని మాటను ఆయన తన తాజా పుస్తకంలో తెలియజేశారు.

01/29/2016 - 06:36

స్మార్ట్ సిటీస్ ఇవే!
భువనేశ్వర్, పుణె, జైపూర్, సూరత్, కొచ్చి, అహమదాబాద్,
జబల్‌పూర్,
విశాఖపట్నం,
షోలాపూర్, దావణగెరె, ఇండోర్, ఢిల్లీ, ఎన్‌డిఎంసి, కోయంబత్తూరు,
కాకినాడ, బెల్గాం,
ఉదయపూర్, గౌహతీ, చెన్నై, లూథియానా, భోపాల్

01/29/2016 - 06:28

న్యూఢిల్లీ, జనవరి 28: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ రూపన్‌వాలా సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించింది. రోహిత్ ఆత్మహత్య కారణాలతో పాటు వరుసగా జరిగిన సంఘటనలు, దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలపై కూడా జస్టిస్ అశోక్ కుమార్ విచారణ జరుపుతారు.

01/29/2016 - 06:25

న్యూఢిల్లీ, జనవరి 28: భారత్-పాక్ మధ్య తలపెట్టిన విదేశాంగ కార్యదర్శుల చర్చల తేదీ ఎండమావిగానే మారుతోంది. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన తేదీ కుదరక పోవడమే ఇందుకు కారణమని చెబుతున్నా..ముంబయి కేసు విచారణే ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్తాన్ చిత్తశుద్ధికి నిదర్శనమని భారత్ వ్యాఖ్యానించింది.

01/28/2016 - 17:09

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పాట్నా జిల్లాలోని తన స్వగ్రామమైన భక్తియార్‌పూర్‌లో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చారు. నితీశ్‌పై పి.కె.రాయ్‌ అనే వ్యక్తి పాదరక్ష విసిరినట్లు పోలీసు అధికారి మను మహరాజ్‌ వెల్లడించారు. అయితే ఆ చెప్పు సభావేదిక దగ్గరే పడిందని.. వెంటనే నిందితుడ్ని అరెస్టుచేసినట్లు తెలిపారు.

01/28/2016 - 16:13

న్యూఢిల్లీ : విమానాశ్రయాల భద్రతపై కేంద్రమంత్రి అశోక గజపతిరాజు స్పందించారు. ఆయన గురువారంనాడిక్కడ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో విమానాశ్రయాల్లో భద్రతను పటిష్టం చేశామని వెల్లడించారు. జనవరి 26న ఎలాంటి దాడులు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని అన్నారు.

01/28/2016 - 16:12

న్యూఢిల్లీ :న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్‌ సిటీలను గురువారం ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విలేకరుల సమావేశంలో వీటిని వెల్లడించారు.స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖపట్నం, కాకినాడ, ఇండోర్, ఉదయ్ పూర్, గువాహటి, చెన్నై, భువనేశ్వర్‌, పుణె, కోయంబత్తూర్‌, భోపాల్‌, లూథియానా,షోలాపూర్‌,కోయంబత్తూర్‌,అహ్మదాబాద్‌,సూరత్‌,కోచి తదితర నగరాలు ఉన్నాయి.

Pages