కెజిబివి టీచర్ల సర్వీసుల క్రమబద్ధీకరణ
Published Friday, 9 December 2016హైదరాబాద్, డిసెంబర్ 8: కేంద్రప్రభుత్వ పథకం కింద నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ను కలిసి కోరామని పేర్కొన్నారు. కెజిబివిలకు కేంద్రం ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే ఆర్థిక సాయం అందిస్తోందని దీనిని 12వ తరగతి వరకూ పెంచాలని కెజిబివిలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని కూడా కోరామని చెప్పారు.