సార్క్ దేశాలు ప్రగతి సాధించాలి
Published Friday, 9 December 2016జగదాంబ, డిసెంబర్ 8: సార్క్ సభ్యదేశాలు సమన్వయంతో పని చేస్తూ ప్రగతి సాధించాలని ఎయు విసి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎయు ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో సార్క్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయులో నెలకొల్పిన సార్క్ కేంద్రం దేశంలోనే ఏకైక కేంద్రంగా నిలుస్తోందన్నారు. యువ విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మంచి పరిశోధనలకు అవకాశం కలిగిందన్నారు. వచ్చే నెల 5 నుంచి జరిగే అంతర్జాతీయ సదస్సులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యానస్ హాజరవుతారన్నారు.