చేతికందని నోటు!
Published Friday, 9 December 2016అనంతపురం, డిసెంబర్ 8: రోజువారీ నగదు లావాదేవీల కోసం జనానికి ముప్పుతిప్పలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు దాటినా పరిస్థితి చక్కబడటం లేదు. డిజిటల్, ఆన్లైన్ లావాదేవీలకు అలవాటుపడాలని ఆర్బిఐ, కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నా అందుకు అనుగుణంగా ప్రజల్లో అవగాహన పెరగడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు, లేదా వచ్చే ఏడాది జనవరి 15లోపు వంద శాతం కాకపోయినా, కనీసం 80 శాతం మేరకు ఆన్లైన్ లావాదేవీలకు ప్రజల్ని అలవాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఇందుకోసం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.