రైస్పుల్లింగ్ కాయిన్ మహత్యం
Published Friday, 9 December 2016హైదరాబాద్, డిసెంబర్ 8: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద తన వద్ద సుమారు రూ.10 వేల కోట్లు ఉన్నట్టు ప్రకటించిన బాణాపురం లక్ష్మణ్రావు ఇంట్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు రైస్పుల్లింగ్ కాయిన్ను కనుగొన్నారు. లక్ష్మణ్రావు వద్ద కేవలం రూ. 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో అతని ఇంటితోపాటు ఇద్దరు కొడుకులు, కోడళ్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఐటి అధికారులు గురువారం లక్ష్మణ్రావు బోగస్ నల్లధనం ప్రకటనపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. లక్ష్మణ్రావును కర్నాటకకు చెందిన బాబు అనే వ్యక్తి బురిడి కొట్టించాడు.