-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లండన్, జూలై 14: ఏడు సిక్సర్లు. పది ఫోర్లు. 79 బంతుల్లో 131 పరుగులు. ఇంగ్లీష్ క్రికెట్స్ బ్లాస్ట్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ ఆరోన్ ఫిన్చ్ మెరుపులివి. టీ-20 చరిత్రలో 79 బంతుల్లో 131 పరుగులు సాధించిన నాటౌట్ బ్యాట్స్మన్గా రికార్డు నమోదు చేశాడు. హోవ్లో జరిగిన కంట్రీ క్రికెట్లో ఇంగ్లీష్ జట్టుతో చెడుగుడు ఆడిన ఫిన్చ్, 52 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.
ఆశలు పెంచుకున్న బెల్జియం ఎట్టకేలకు ప్లే-ఆఫ్ మ్యాచ్లో విజయం సాధించి ప్రపంచకప్ పోరులో మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది. అనాసక్తంగా ఆడిన ఇంగ్లాండ్ మాత్రం గోల్ లేకుండానే సాకర్ నుంచి నిష్క్రమించింది. సెయంట్ పీటర్స్బర్గ్ స్టేడియంలో జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్లో 2-0తో కైవసం చేసుకున్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న బెల్జియం ఆటగాళ్లు.
లండన్, జూలై 14: భారత్తో శనివారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్పై ఆశలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదటి వనే్డలో ఓటమిపాలైన ఈ జట్టు రెండో మ్యాచ్లో ఎదురుదాడికి దిగింది. జో రూట్ సెంచరీ (113), ఇయాన్ మోర్గాన్ (53), డేవిడ్ విల్లే (50) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 322 పరుగులు చేసింది.
బ్యాంకాక్, జూలై 14: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సింధు థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో సింధు 23-21, 16-21, 21-9 స్కోరు తేడాతో ప్రత్యర్థి ఇండోనేషియాకు చెందిన గ్రెగొరియా తన్జంగ్పై విజయం సాధించింది.
న్యూఢిల్లీ, జూలై 14: సెర్బియాలోని సబొటికాలో జరుగుతున్న వొవొడినా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అప్రతిహతంగా దూసుకెళ్తున్నారు. అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల సాధనవైపు దూసుకెళ్తున్నారు. ఏకంగా తొమ్మిది మంది బాక్సర్లు తమ తమ క్వార్టర్ ఫైనల్స్ను సమర్థంగా ముగించుకొని సెమీ ఫైనల్ చేరారు. వీరిలో ఆరుగురు మహిళలు కావడం విశేషం.
బ్యాంకాక్: వరుస టోర్నమెంట్లో పూర్తిగా విఫలమైన భారత స్టార్ షట్లర్ సింధు థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్కు ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు 21-17, 21-13 స్కోరు తేడాతో మాలేసియాకు చెందిన వరల్డ్ నంబర్ 35 క్రీడాకారిణి సోనియా చేహాపై విజయం సాధించింది.
నొట్టింగామ్, జూలై 13: ఇంగ్లాండ్తో త్వరలో మొదలయ్యే ఐదు టెస్ట్ల సిరీస్లోనూ ‘కీ వెపన్స్’నే ప్రయోగించాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆశపడుతున్నాడు. ‘టెస్ట్ మ్యాచ్లకు ఆటగాళ్ల ఎంపిక సమయంలో ఏమైనా జరగొచ్చు. కాకపోతే కొన్ని సర్ప్రైజ్లు ఉంటాయేమో. కుల్దీప్ మంచి ఫాంలో ఉన్నాడు. అలాగని చాహల్ను తక్కువ అంచనా వేయలేం’ అంటూ హింట్ ఇస్తున్నాడు కోహ్లీ.
‘టీమిండియా మీద కాదు, ఇప్పుడు ఆడాల్సింది కుల్దీప్ మీద’ ఇదీ ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ అంతర్మథనం. కుల్దీప్ పేరు చెబితే ఇప్పుడు ఇంగ్లాండ్ వణుకుతుంది. ‘కుల్దీప్ బంతుల్ని అంచనా వేయడంపైనే దృష్టి పెట్టాం. ఓల్డ్ ట్రఫోర్డ్, కార్డ్ఫి మైదానాల్లో మాదిరిగానే లార్డ్స్లోనూ కుల్దీప్ చెలరేగొచ్చు. కానీ, గత రెండింటిలో అతని బంతుల్ని అలవాటుపడ్డాం. ఈసారి సమర్థంగానే ఎదుర్కొంటాం.
లండన్, జూలై 13: అద్భుతమేదీ జరక్కపోతే శనివారం లార్డ్స్లో జరగనున్న రెండో వనే్డతో టీమిండియా మరో సీరిస్ సొంతం చేసుకోవడం ఖాయం. ఇప్పటికే టీ-20 సిరీస్ను సాధించి, తొలి వనే్డలో ప్రత్యర్థి ఇంగ్లాండ్ను చావుదెబ్బ కొట్టిన భారత్, ఈ టూర్లో మరో ఘనమైన రికార్డు నమోదు చేయడానికి ఉవ్విళ్లూరుతోంది.
న్యూఢిల్లీ, జూలై 13: భారత జట్టులో పనె్నండేళ్లు కొనసాగిన మిడిల్ ఆర్డర్ కుడి చేతివాటం బ్యాట్స్మన్ మహ్మద్ కైఫ్ క్రికెట్లో అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. 2002లో ఇంగ్లాండ్పై అంతర్జాతీయ వనే్డ మ్యాచ్తో అరంగేట్రం చేసిన మిడిల్ అర్డర్ బ్యాట్స్మన్ కైఫ్ మొత్తం 125 మ్యాచ్ల్లో 2753 పరుగులు సాధించి భారత జట్టులో మేటి బ్యాట్స్మన్గా నిలబడ్డాడు.