-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
మెల్బోర్న్, మార్చి 23: విరాట్ కోహ్లీపై క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), మీడియా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, మాజీ కెప్టెన్లు మాత్రం అతనిని అభినందిస్తూ, బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. కోహ్లీని గొప్ప నాయకుడిగా ఆసీస్ ‘లెజెండ్’ ఆడం గిల్క్రిస్ట్ గురువారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభివర్ణించాడు. జట్టునే కాదు..
విశాఖపట్నం, (స్పోర్ట్స్) మార్చి 23: దేవధర్ ట్రోపీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఇండియా బ్లూ, ఇండియా రెడ్ జట్లు గురువారం విశాఖ చేరుకున్నాయి. విశాఖ విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులు స్వాగతం పలుకగా వీరికి ఆతిథ్యం ఇస్తున్న నొవాటెల్, గ్రీన్పార్కు హోటల్లో సంబంధిత సిబ్బంది సాంప్రదాయరీతిలో తిలకం దిద్ది పూలదండలతో ఆహ్వానం పలికారు.
ముంబయి, మార్చి 22: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్టు లభించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం సెంట్రల్ కాంట్రాక్టులను ఖరారు చేసింది. ఆటగాళ్ల కాంట్రాక్టు ఫీజును భారీగా పెంచింది. కోహ్లీ, ధోనీసహా మొత్తం ఏడుగురికి ‘ఎ’ గ్రేడ్లో కాంట్రాక్టు లభించింది. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు ఇకపై రెండు కోట్ల రూపాయల ఫీజు లభిస్తుంది.
మెల్బోర్న్, మార్చి 22: ధర్మశాలలో జరిగే చివరి, నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందని, ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే ఆ పిచ్పై భారత్కు కష్టాలు తప్పవని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ జోస్యం చెప్పాడు. ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ధర్మశాల వికెట్పై ఉన్న పచ్చిన పేసర్లకు ఉపయోగపడుతుందని అన్నాడు.
న్యూఢిల్లీ, మార్చి 22: కొన్ని సభ్య సంఘాలు ఒకవైపు భారీ మొత్తాల్లో నిధులు ఉంచుకొని, మరోవైపు నిధుల కోసం దరఖాస్తులు చేసుకున్నాయని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పాలనాధికారుల కమిటీ (సిఒఎ) పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్పిసిఎ), సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సిఎ) పెట్టుకున్న దరఖాస్తులను ఆ నివేదికలో పేరొంది.
ధర్మశాల, మార్చి 22: ఆస్ట్రేలియాతో ఈనెల 25వ తేదీ, శనివారం నుంచి మొదలయ్యే చివరి, నాలుగో టెస్టులో టీమిండియా మీడియం పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కే అవకాశాలున్నాయి. నిరుడు నవంబర్లో ఇంగ్లాండ్తో మొహాలీలో మూడో టెస్టు ఆడుతున్న సమయంలో షమీ మోకాలికి గాయమైంది. దీనితో అతను మిగతా రెండు టెస్టుల్లో ఆడలేదు. ఆస్ట్రేలియాతో ఇంత వరకూ జరిగిన మూడు టెస్టుల్లోనూ అతనికి స్థానం లభించలేదు.
న్యూఢిల్లీ, మార్చి 21: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసిన ప్రపంచ అత్యుత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో టీమిండియా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
న్యూఢిల్లీ, మార్చి 21: చాలా దేశాలు ఇప్పటికే పోటీలో ఉన్నందున 2022లో జరిగే కామనె్వల్త్ క్రీడల కోసం మన దేశం పోటీ పడదని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ రామంచద్రన్ మంగళవారం స్పష్టం చేశారు. ‘బరిలో చాలా మంది ఉన్నారు. కామనె్వల్త్ గేమ్స్ నిర్వహణనుంచి వైదొలుగుతామని డర్బన్ చెబుతున్నప్పటికీ ఆ నగరం ఇప్పటివరకు అధికారికంగా వైదొలగలేదు.
రాంచీ, మార్చి 20: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాదే పైచేయిగా కనిపించినప్పటికీ, చివరి రోజైన సోమవారం నాటి ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మన్ పీటర్ హ్యాండ్స్కోమ్, ఆల్రౌండర్ షాన్ మార్ష్ అసాధారణ పోరాట ప్రతిభతో మ్యాచ్ని డ్రాగా ముగించగలిగారు.
రాంచీ: రవీంద్ర జడేజా ఈఏడాది ఇంత వరకూ నాలుగు టెస్టులు ఆడాడు. అత్యధికంగా 27 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ 23 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, అతను స్వదేశంలో ఆడిన 21 టెస్టుల్లో మొత్తం 117 వికెట్లు కూల్చాడు.