-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇండోర్, అక్టోబర్ 7: తమకు ప్రతికూలంగా మారుతున్న సెషన్ను ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది కెప్టెన్సీలో తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠాల్లో ఒకటని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
బెంగళూరు, అక్టోబర్ 7: క్రీడాకారులకు సహచర ప్రత్యర్థులతో ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడే హక్కు ఉందని ప్రముఖ మహిళా రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాఖ్యలు ఉరీలో ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో పాక్ ఆటగాళ్లను భారత్లో ఆడేందుకు అనుమతించాలా? అనే అంశంపై చర్చకు దారితీయడంతో ఆమె వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది.
బీజింగ్, అక్టోబర్ 7: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్కు అనూహ్య ఓటమి ఎదురైంది. ఈ టోర్నీలో రెండో సీడ్గా బరిలోకి దిగిన నాదల్పై శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో అన్సీడెడ్ ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ 6-2, 6-4 సెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. దీంతో నాదల్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి నిరాకరించడం ద్వారా కోర్టుతోనే ఢీకొనే సాహసం చేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు చుక్కెదురైంది. భారత క్రికెట్లో పారదర్శకత కోసం లోధా కమిటీ చేసిన సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేసి తీరాలని బిసిసిఐకి ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనాకు మళ్లీ టీమిండియాలో చోటు లభించింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ గురువారం ఎంపిక చేసింది. చీఫ్ సెలక్టర్ హోదాలో ఎమ్మెస్కే ప్రసాద్ తొలిసారి పాల్గొన్న కమిటీ సమావేశంలో మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించారు.
దర్బన్, అక్టోబర్ 6: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వనే్డలో దక్షిణాఫ్రికా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. 372 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి అందుకొని, ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో గెల్చుకుంది. దీనితో చివరి రెండు వనే్డల ఫలితాలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. మూడో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 371 పరుగుల భారీ స్కోరు సాధించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను కొనసాగిం చాలా? వద్దా? అన్న అంశంపై సభ్య సంఘాలదే తుది నిర్ణయమని బిసిసిఐ అ ధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. 2013 ఐపిఎల్లో చోటు చేసుకున్న స్పా ట్ ఫిక్సింగ్, బెట్టింగ్ సంఘటన అనంతరం భారత క్రికెట్లో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిసిసిఐ ప్రక్షాళనకు లోధా కమిటీ సిఫా ర్సులు చేయడానికి కూడా అదే నేపధ్యం.
లాసనే్న, అక్టోబర్ 6: రష్యా అథ్లెట్ అన్నా చిచెరొవా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సాధించిన కాంస్య పతకాన్ని రద్దు చే స్తున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) ప్రకటిం చింది. బీజింగ్ ఆమె మహిళల హైజంగ్ విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల తర్వాత, 2012 లండన్ ఒలిం పిక్స్లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.
బెంగళూరు, అక్టోబర్ 6: కౌంటాన్ (మలేసియా)లో ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఎసిటి) హాకీ టోర్నమెంట్లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు శ్రీజేష్ నాయకత్వం వహిస్తాడు. రియో ఒలింపిక్స్లో కెప్టెన్గా వ్యవహరించిన శ్రీజేష్ను అదే స్థానంలో కొనసాగించాలని బుధవారం ఇక్కడ సమావేశమైన జాతీయ హాకీ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.
అహ్మదాబాద్, అక్టోబర్ 6: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరిగే కబడ్డీ ప్రపంచ కప్లో టైటిల్ వేటుకు భారత్ సిద్ధమైంది. శుక్రవారం నాటి మొదటి మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది. మరో మ్యాచ్ అమెరికా, ఇరాన్ జట్ల మధ్య జరుగుతుంది. 2004, 2007 సంవత్సరాల్లో కబడ్డీ ప్రపంచ కప్ జరగ్గా, రెండు పర్యాయాలూ ఇరాన్ను ఓడించిన భారత్ టైటిళ్లను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ రెండు సార్లు మూడో స్థానంలో నిలిచింది.