S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/15/2017 - 02:26

అమరావతి, డిసెంబర్ 14: విద్యుత్ పొదుపులో నవ్యాంధ్ర తన ఆధిక్యతను మూడోసారి నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇప్పటికే 41 లక్షలకు పైగా ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చి ఏటా 600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టింది.

12/15/2017 - 02:24

కొత్తగూడెం, డిసెంబర్ 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేళ్లమడుగు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో సీపీఐ(ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గానికి చెందిన 8 మంది నక్సల్స్ మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

12/15/2017 - 02:21

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 14: రచయితలకు అభిమానులుండటం సహజమే..కానీ రచయితకు తోటి రచయితలనే అభిమానులు చేసుకున్న రచన శైలీ ఇచ్ఛాపురం జగన్నాథరావుకే సొంతం. ఇపుడు ఆ కలం మూగబోయింది. 86 ఏళ్ల వయస్సు కల్గిన ఇచ్చాపురం జగన్నాథరావు సాహితీలోకానికి ఐ.జె.రావుగా సుపరిచితులు. ఈ నెల 13న బంజారాహిల్స్‌లోని తన నివాసంలో సాయంత్రం కూర్చీ కూర్చోని సెల్‌ఫోన్ చూస్తూ వెనక్కి ఒరిగారు.

12/13/2017 - 23:15

ప్రపంచ తెలుగు మహా సభలకు ఏర్పాట్లు పూర్తి 5రోజులు.. 6 వేదికలు.. వంద సదస్సులు
వివిధ దశల్లో 200 పుస్తకాల ఆవిష్కరణ సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి వెల్లడి

12/13/2017 - 23:07

ఖైరతాబాద్, డిసెంబర్ 13: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యశోద ఆసుపత్రిలో రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు అత్యాధునిక సాంకేతిక పద్ధతిలో శస్త్ర చికిత్సలు నిర్వహించి పునఃర్జన్మ ప్రసాదించారు యశోద వైద్యులు.

12/13/2017 - 22:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యతారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి గందరగోళంగా తయారైందని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు విమర్శించారు. రామచందర్‌రావు తన నిరసనను లేఖ రూపంలో బాబుకు పంపారు. ‘కేంద్రం అనుమతి లేకుండా ప్రాజెక్టు అంచనాలను మీ ఇష్టానుసారం పెంచేయడం వల్లే పోలవరం గదరగోళంలో పడిపోయింది’ అని ఆయన దుయ్యబట్టారు.

12/13/2017 - 03:33

తిరుపతి, డిసెంబర్ 12: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి పర్వదినాలతోపాటు నూతన ఆంగ్ల సంవత్సరం 2018, జనవరి 1న తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.

12/13/2017 - 03:31

హైదరాబాద్, డిసెంబర్ 12: హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి కదలాలంటే స్థానికత ఇవ్వాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చిన ఉద్యోగులు ఈ రోజు స్థానికత హోదాకు ఆసక్తికనపరచడం లేదు. 2015లో ఇక్కడి నుంచి ఏపి సచివాలయాన్ని అమరావతికి తరలించిన విషయం విదితమే. ఆ సమయంలో దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులను బదిలీ చేశారు.

12/13/2017 - 02:49

తిరుపతి, డిసెంబర్ 12: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఎల్-1 దర్శనం ఒక వ్యాపారంగా మారిందని, ప్రముఖులకే కేటాయిస్తున్నామని అధికారులు చెబుతున్నా అర్హతలేనివారు ఎల్-1 దర్శనాలు చేసుకుంటున్నారని నగరి ఎమ్మెల్యే రోజా మరోమారు ఆరోపించారు. మంగళవారం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఎల్-1 అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు.

12/13/2017 - 02:24

హైదరాబాద్, డిసెంబర్ 12: కొత్త రైల్వేలైన్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. మంగళవారం రైల్వే డివిజనల్ మేనేజర్లతో ఆయన సమావేశమయ్యారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు సమన్వయంతో పూర్తి చేసేందుకు యత్నించాలని సూచించారు.

Pages