S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/20/2017 - 02:05

హైదరాబాద్, నవంబర్ 19: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో ఆవిష్కరించబోతోంది. గ్రామ పంచాయతీ వ్యవస్థ రూపు రేఖలు మారనున్నాయి. వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల రెండో విడత సమావేశాల్లో పంచాయతీ చట్టం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా 10వేలకు పైగా గ్రామ పంచాయితీలు, 583 మండలాల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.

11/20/2017 - 02:03

హైదరాబాద్/ ఉప్పల్, నవంబర్ 19: చదువు సాకుతో హిందువులను చేరదీసి ఇస్లాం మతంలోకి బలవంతపు మార్పిడికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యంది. 10 మంది సభ్యులతో కూడిన ఘరానా ముఠాను రాచకొండ మల్కాజిగిరి పోలీసు స్పెషల్ టీం అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మరో ముఠా సభ్యుడి కోసం గాలిస్తున్నట్లు మల్కాజగిరి ఏసీపీ గోనె సందీప్ వెల్లడిం చారు.

11/20/2017 - 03:57

రాజమహేంద్రవరం, నవంబర్ 19: కళల రాజధాని చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ మువ్వగోపాల కల్చరల్ ఆర్ట్ అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ఆదివారం జాతీయ స్థాయి శాస్ర్తియ నృత్య ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు దేశ వ్యాప్తంగా వచ్చిన 600 మంది శాస్ర్తియ నృత్య విద్యార్థులు, కళాకారుల ప్రదర్శనలు వైభవంగా సాగాయి.

11/20/2017 - 01:52

గుంటూరు, నవంబర్ 19: కమ్యూనిజం, ప్రపంచ సోషలిస్టు విప్లవ పురోగమన శక్తులకు స్థావరంగా ఉన్న చైనాతో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెగదెంపులు చేసుకుంది. ప్రస్తుతం చైనా ఓ నూతన సోషల్ సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగిందని, అది పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమేనని మావోయిస్టు పార్టీ తేల్చిచెప్పింది.

11/20/2017 - 01:50

అనంతపురం, నవంబర్ 19: దేశంలో కొనసాగుతున్న మతోన్మాద దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు వౌనం వహించడం సరైందికాదని సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. అనంతపురంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో గో సంరక్షణ పేరిట దాడులు కొనసాగుతున్నాయన్నారు.

11/20/2017 - 01:48

అమరావతి, నవంబర్ 19: ప్రత్యేక హోదా, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, వైసీపీ దూకుడు వంటి కీలక అంశాలతో పాటు కేంద్రంతో సత్సంబంధాలు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 60 మందిని మారిస్తే తప్ప, మళ్లీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని వివిధ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

11/20/2017 - 01:45

గుంటూరు, నవంబర్ 19: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిని కోల్పోతున్నాయి. సర్పంచ్‌లకు అధికారాల బదలాయింపు అందని ద్రాక్షగా మారుతోంది. అన్నింటికీ మించి విద్యుత్ బకాయిలపై సర్కార్ నోరు మెదపకపోవటంతో వందలాది గ్రామాల్లో వీధిదీపాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సచివాలయానికి ఒక విడత బిల్లు రూ.

11/20/2017 - 01:44

నేతన్నకు మార్కెట్ దన్ను కల్పిస్తామంటుంది ప్రభుత్వం. అదే కరవైందని అంటోంది చేనేతల వర్గం. తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘చేనేత మిత్ర’ పథకాన్ని ప్రారంభించి
24 గంటలు దాటకుండానే, చేనేతలు ఇలా రోడ్డునపడ్డారు. హైదరాబాద్ శివారులోని నిజాంపేట పంచాయతీ ఆఫీస్ వద్ద రోడ్డుమీదే వస్త్రాలను పెట్టి కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న చేనేత మహిళ.
*
అడిగే నాథుడు కరవై

11/19/2017 - 03:59

హైదరాబాద్, నవంబర్ 18: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరమంతా అలర్ట్ అయింది. పాతబస్తీ మ్తొం పోలీసుల అదుపులోకి వెళ్లింది. దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మోదీ, ఇవాంక డిన్నర్ ఉన్నందున ఆ ప్రాంతంలో పటిష్ట భద్రత చేపట్టారు.

11/19/2017 - 03:49

హైదరాబాద్, నవంబర్ 18: భారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో హిందూమతం నుండి క్రిస్టియన్ మతంలోకి మతమార్పిడిలు యథేచ్చగా జరుగుతున్నాయని, ఈ విధానం మంచిది కాదని విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పేర్కొన్నారు. హిందూసమాజంలో పేదరికాన్ని కొన్ని క్రైస్తవ సంస్థలు మతమార్పిడిలకోసం వినియోగించుకుంటున్నాయని గుర్తు చేశారు.

Pages