S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/18/2017 - 03:33

తెలంగాణ రహదారులు రక్తమోడాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో సంభవించిన ఘోర ప్రమాదాల్లో 10మంది మృత్యువాతపడ్డారు. కనీసం 20మంది తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

11/18/2017 - 01:34

అమరావతి, నవంబర్ 17: కాపు రిజర్వేషన్లు కొలిక్కి వస్తాయా? ఇప్పుడున్న రిజర్వేషన్ల సంఖ్య పెంచడం న్యాయబద్ధమా? విరుద్ధమా? ముందు బీసీలకు రిజర్వేషన్ల సంఖ్య పెంచకపోతే, కాపు రిజర్వేషన్ చెల్లుతుందా? రాజస్థాన్ సర్కారు పెంచిన ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తెరపైకొస్తున్న సందేహాలివి.

11/18/2017 - 01:29

హైదరాబాద్, నవంబర్ 17: అక్రమాస్తుల కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆంధ్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇక్కడ సిబిఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. జగన్‌తోపాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. జగన్ ఈనెల 6న కడప జిల్లా ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

11/18/2017 - 01:26

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పాలనే ఆశయంతో ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని సిఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సీఎం ప్రకటన చేశారు. డిసెంబర్ 15 నుండి 19 వరకూ ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయన్నారు.

11/18/2017 - 01:25

విశాఖపట్నం, నవంబర్ 17: ‘ఐటీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో 20 ఏళ్లుగా మీతో కలిసి చేసిన ప్రయాణం వాస్తవ రూపం దాల్చింది. మరో ఏడాదిపాటు ఈ ప్రయాణాన్ని మరింత వేగంగా కొనసాగిస్తే అద్భుతాలు సాధించవచ్చు..’ అని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. ‘ఏపీ అగ్రిటెక్ సమ్మిట్-2017’ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, ఆంధ్ర భవిష్యత్ రైతులపైనే ఆధారపడి ఉందన్నారు.

11/18/2017 - 01:43

హైదరాబాద్, నవంబర్ 17: ‘లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచండి..’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ‘రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు -కొత్తగా పాలన వ్యవస్థ’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నలు, సందేహాలకు సిఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. పరిపాలనా సంస్కరణలు, సౌలభ్యం కోసమే జిల్లాల సంఖ్య పెంచామన్నారు.

11/18/2017 - 00:34

హైదరాబాద్, నవంబర్ 17: సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ, పుట్టా మధుకర్, దుర్గం చిన్నయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు సిఎం బదులిస్తూ సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై వివరణ ఇచ్చారు. 12 గనుల్లో ఆరు భూగర్భ గనులు, ఆరు ఉపరితల గనులు ఉన్నాయని అన్నారు.

11/17/2017 - 04:23

హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక ఔత్సాహిక సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఈ నెల 26నే హైదరాబాద్ చేరుకోనున్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని భద్రతా అధికారులు గోప్యంగా ఉంచారు. సదస్సును ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

11/17/2017 - 04:19

తిరుపతి, నవంబర్ 16: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం అమ్మవారు శ్రీమన్నారాయణుడి అవతారంలో పెద్దశేష వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందుభాగాన అశ్వాలు, వృషభాలు, గజరాజులు ఠీవిగా ముందుకు కదులుతుంటే మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మ వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

11/17/2017 - 04:28

చండ్రుగొండ, నవంబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల రెవెన్యూ పరిధిలో సీలింగ్ భూముల హక్కులపై ఆదివాసీలు, గిరిజనేతరుల మధ్య గురువారం తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఆదివాసీ మహిళలు, యువకులపై గిరిజనేతరులు దాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 1992లో ప్రభుత్వం మండలంలోని అయ్యన్నపాలెం, సీతాయిగూడెం గ్రామాలకు చెందిన ఆదివాసీలకు 7 ఎకరాల భూమిని పంపిణీ చేసి హక్కు పత్రాలు అందజేసింది.

Pages