S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/19/2018 - 05:24

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య’ అవార్డు-2018’ కు ప్రముఖ కవి వజ్జల శివకుమార్ ఎంపిక య్యారు. సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన అవార్డు ఎంపిక కమిటీ ఈ నెల 11న సమావేశమై వజ్జల పేరును ఖరారు చేసింది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఈ నెల 22న ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందిస్తారు.

07/19/2018 - 05:25

హైదరాబాద్, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు సమీపంలో ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని రోడ్ల దుస్థితి, తదితర సమస్యలపై జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేసేందుకు బుధవారం నగర కాంగ్రె స్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు ప్రధాన రోడ్డుపైనే అరెస్టు చేశారు.

07/19/2018 - 05:28

హైదరాబాద్, జూలై 18: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి ‘నేను సైతం’ అంటూ ఓ చిన్నారి ముందుకొచ్చింది. తన జన్మదినం సందర్భంగా రూ.లక్ష విరాళం అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. తన పుట్టిన రోజు వేడుకకు అనవసరంగా డబ్బులు వృథా చేయకుండా దానిని సీఎం సహాయం నిధికి ఇచ్చిన వరుణిక మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లోనూ మనవతావాదాన్ని చాటేవారున్నారని నిరూపించింది.

07/18/2018 - 13:21

విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో పర్యావరణ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఇ.సత్యనారాయణ ఇళ్లపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

07/18/2018 - 04:54

అమరావతి, జూలై 17: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు ప్రణాళిక సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మురుగునీటి పారుదల, ఘన,ద్రవ వ్యర్థాల నిర్వహణ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఎల్‌ఈడీ వీధి దీపాలు సీసీరోడ్ల నిర్మాణం వంటి వౌలిక వసతుల కల్పనే పునాదిగా పల్లెసీమలు అభివృద్ధిచెందాలని ఆకాంక్షించారు.

07/18/2018 - 04:55

విశాఖపట్నం, జూలై 17: విశాఖ రైల్వే జోన్ సాధన కోసం తన మంత్రి పదవిని కూడా పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా జేఏసీ చేపట్టే ఎటువంటి నిరసన కార్యక్రమంలోనైనా పాల్గొంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

07/18/2018 - 00:48

అమరావతి, జూలై 17: తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చేనెలలో జరిగే మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజులు భక్తులకు దర్శనం నిలిపివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

07/18/2018 - 00:41

హైదరాబాద్, జూలై 17: వచ్చేనెల ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 68 మున్సిపాల్టీలతో పాటు పదవీకాలం ముగిసిన 12751 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరి నియమానికి సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని కలక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

07/18/2018 - 05:07

హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడంతో పాటు రైతులకు ఆర్థికంగా లాభం చేకూర్చేందుకు ఉద్దేశించిన ‘శే్వత విప్లవాని’కి ప్రభుత్వం 1677.11 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. జాతీయ స్థాయిలో వినూత్న పథకంగా దీన్ని పేర్కొనవచ్చు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభించిన పథకాల్లో దీన్ని విప్లవాత్మక పథకంగా నిపుణులు పేర్కొంటున్నారు.

07/18/2018 - 05:11

తిరుపతి, జూలై 17: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివార ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జియ్యంగార్, చిన్న జీయంగారు, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ దంపతులు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ఇన్‌చార్జ్ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు పాల్గొన్నారు.

Pages