-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: మంత్రి ఈటెల రాజేందర్ బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన తీరును గమనించైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. రైతులను బ్యాంకులు ఇబ్బందికి గురి చేస్తున్నాయని తాము ఎన్నో ఆందోళనల సందర్భంగా చెప్పామని, అదే పరిస్థితిని మంత్రి ఈటెల బ్యాంకర్ల సమావేశంలో చెప్పారని అన్నారు. దీంతో ఈ ప్రభుత్వ వైఖరిపై ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయని విమర్శించారు.
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, బంగారు తెలంగాణ కలను సాకారం చేయాలని, తద్వారా దేశంలోనే ఆదర్శంగా ఈ రాష్ట్రాన్ని నిలపాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 24: రాజధాని నగరంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ అమర వీరుల స్థూపం నిర్మించనున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 350 కోట్ల రూపాయల వ్యయంతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 300 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ కళాభారతిని రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, జూన్ 24: దేశంలోనే వినూత్నమైన విధానంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ తీరుతెన్నులపై శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు.
గద్వాలటౌన్, జూన్ 23: జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘నీట్’లో గద్వాలకు చెందిన డి.సాయ సౌగంధ్ 98వ ర్యాంక్ సాధించాడు. శుక్రవారం విడుదల చేసిన నీట్ ఫలితాల్లో 669 మార్కులతో ప్రతిభను చాటాడు. జాతీయస్ధాయిలో ర్యాంకు సాధించిన సౌగంధ్ గద్వాల పట్టణంలోని విశ్వభారతి టెక్నో స్కూల్లో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. పాఠశాల కరస్పాండెంట్ త్యాగరాజు విద్యార్థికి అభినందనలు తెలిపారు.
చిత్రం.. డి.సాయ సౌగంధ్
భూదాన్పోచంపల్లి, జూన్ 23: చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త పొదుపు పథకం ‘్భవిత’ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా పొదుపు పథకం ప్రారంభం కానుంది. ప్రస్తుతమున్న 8 శాతం మ్యాచింగ్ గ్రాంట్ను రెట్టింపుచేయనున్నారు.
కోనరావుపేట, జూన్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ముగ్గురు విద్యార్థులు శుక్రవారం ఈతకు వెళ్ళి నీటిలో మునిగి మృత్యువాతకు గురయ్యారు. రంజాన్ సందర్భంగా విద్యార్థులకు సెలవు ఇవ్వడంతో స్నేహితులు కలిసి సరదాగా ఈతకు వెళ్ళారు. గ్రామంలోని కుమ్మరికుంటలో ఈతకు వెళ్ళిన ఎనగంటి సంజీవ్ (14), కుడుకల మనోహర్ (14), కుడుకల రాజు (14) ఈతకు వెళ్ళారు.
వరంగల్, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ప్రసిద్ధ యాదగిరిగుట్ట నృసింహస్వామి దేవాలయ గర్భగుడి పనులు త్వరలో పూర్తిచేసి దసరా పర్వదినం నుంచి భక్తులకు స్వామివారి నిజదర్శనం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కౌడిపల్లి, జూన్ 23: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలకులపై నిరంతరం పోరాడుతామని జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం స్పష్టం చేశారు. అమరుల స్ఫూర్తి యాత్ర శుక్రవారం కౌడిపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జూన్ 23: ఏకీకృత సర్వీసు గెజిట్ రాగానే దీనికి సంబంధించిన కార్యాచరణ చేపడతామని, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, దీని కోసం ఉపాధ్యాయ సంఘాలతో త్వరలోనే సమావేశం నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.