-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. మునుపెన్నడూ కనీవిననీ సంఘటన చోటు చేసుకోవడంతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై తమకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
నాగర్కర్నూల్, నవంబర్ 5: బాధ్యతాయుతమైన సీఏం పదవిలో ఉండి రెవిన్యూ సిబ్బందిపై బాధ్యతారహిత్యంగా చేసిన అవినీతి ఆరోపణల పర్యవసానమే తహశీల్దార్ విజయారెడ్డిపై సజీవ దహన ఘటనతో పాటు డ్రైవర్ మృతి చెందడానికి కారణమని మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ఆ లేఖ ప్రతులను నాగం జనార్ధన్రెడ్డి స్థానిక విలేఖరులకు అందచేశారు.
గరిడేపల్లి : హత్యకు గురైన తహశీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో సూర్యాపేట జిల్లా వెలిదండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయారెడ్డి హత్య సంఘటనలో తహశీల్దార్ ప్రాణాలను కాపాడబోయి తన ప్రాణాలను బలి ఇచ్చి అమరుడైన కామళ్ల గురునాథం మృతిపట్ల ప్రతి ఒక్కరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
సైదాబాద్, నవంబర్ 5: అబ్దుల్లాపూర్మెట్ మండలం తహశీల్దార్ సజీవదహనం ఘటన సమయంలో ఆమెను కాపాడే ప్రయత్నంలో గాయపడిన డ్రైవర్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యాలయంలోనే తహశీల్దార్ విజయారెడ్డిని గౌరెల్లికి చెందిన నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చిన సంగతి విదితమే.
మహబూబాబాద్, నవంబర్ 5: ప్రజాబలం లేని ప్రతిపక్షాలు ఆర్టీసీ సమ్మెను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయని, కార్మికులు దీన్ని గుర్తించి భేషరతుగా విధుల్లో చేరాలని రాష్ట్ర గిరిజన, స్ర్తిశిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల భవిష్యత్తుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ..
హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హామీ ఇచ్చారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలకు మంగళవారం ఆయన ఈ మేరకు సందేశం పంపించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతో పాటు, శాఖాపరంగా సమస్యలు ఏవైనా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, నవంబర్ 5: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 7వ తేదీ వరకూ గడువు విధించినట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 5: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన అంధోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు పరామర్శించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సురేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు క్రాంతి కిరణ్ను వేర్వేరుగా కలిసి పరామర్శించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల వాగ్వాదంతో గాంధీభవన్ వేడెక్కింది. ఏఐసీసీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని ప్రచారం చేసేందుకు మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆజాద్ గాంధీభవన్లో పార్టీ సీనియర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నేతలు వీ హనుమంతరావు,
హైదరాబాద్, నవంబర్ 5: ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. విధుల్లో చేరికకు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించినప్పటికీ ఎవరూ విధుల్లో చేరడం లేదని, తామంతా ఒకే మాట మీద నిలబడ్డామని జేఏసీ పేర్కొంది. అక్కడక్కడా కొందరు కార్మికులు విధుల్లో చేరుతున్నట్టు లేఖలు ఇచ్చినప్పటికీ వారి సంఖ్య పరిగణనలోకి తీసుకోదగ్గ స్థాయిలో లేదని పేర్కొంది.