-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్/రాజేంద్రనగర్, అక్టోబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అగమ్యగోచరంగా మారిందని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వీ. హనుమంత రావువిమర్శించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం ఇందిరా విజయయాత్ర రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ దుర్గానగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వైపుసాగింది.
హైదరాబాద్, అక్టోబర్ 19: రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు చుక్కలు చూపిస్తారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. పటాన్చెర్వు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ వేలాది మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన కార్యక్రమంలో రమణ పార్టీ కండువా కప్పి నందీశ్వర్ గౌడ్ను స్వాగతించారు.
హైదరాబాద్, అక్టోబర్ 19: అస్సాం , త్రిపుర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, అందువల్ల తెలంగాణ ద్రోహులు, అవకాశవాదులతో కలవకుండాఅనే తాము నేరుగా పోటీలోకి దిగుతున్నామని అన్నారు.
హైదరాబాద్/ వనస్థలిపురం, అక్టోబర్ 19: ఆర్థిక సమస్యలు, భార్య భర్తల మధ్య గోడవ ముగ్గురు ప్రాణాలను బలిగొంది. ఈ విషాదం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ గ్రామానికి చెందిన రమేష్, స్రవంతి (25) బతుకు దెరువుకోసం నగరానికి వచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 19: పాఠశాలల అనుబంధ గుర్తింపునకు సంబంధించి సీబీఎస్ఈ నిబంధనల్లో మార్పు చేసింది. అయితే తాజాగా రూపొందించిన నిబంధనలపై విద్యావేత్తలు, ఉదపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కఠిన నిబంధనలను నీరుగార్చడమేనని వారు పేర్కొంటున్నారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉన్న నిబంధనలను సైతం సీబీఎస్ఈ గాలికి వదిలేస్తోందని విద్యావిశే్లషకుడు ఎన్ నారాయణ పేర్కొన్నారు.
చౌటుప్పల్, అక్టోబర్ 17: దసరా పండుగకు ప్రజలు పట్నం విడిచి పల్లెకు పయనమయ్యారు. ప్రభుత్వం దసరా పండుగకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సెలవులు ఇవ్వడంతో పల్లెకు వెళ్లి పండుగ చేసుకునేందుకు తమ వాహనాలలో బయలుదేరారు. దీంతో దసరా ముందు రోజు హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారికి వాహనాల తాకిడి పెరిగింది. రోజువారి కంటే వాహనాలు రెట్టింపు అయ్యాయి.
హైదరాబాద్, అక్టోబర్ 17: కాంగ్రెస్లో పొత్తుల చిచ్చు కొనసాగుతున్నది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్కు మిత్రపక్షాలను సంతృప్తిపరచడం తలకు మించిన భారంగా మారింది. కాంగ్రెస్కు బలమైన సీట్లు, తప్పని సరిగా గెలుపొందుతామన్న ధీమా ఉన్న సీట్లనే టీడీపీ, సీపీఐ లేదా టీజేఎస్ కోరుతున్నాయి.
కాంగ్రెస్ హామీలను ప్రజలు విశ్వసించడం లేదు: ఎంపీ వినోద్ * కూటమికి డిపాజిట్లు కూడా దక్కవు: ఎంపీ బాల్క
హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ పాలన అసలు రంగు అర్ధమైందని టీఆర్ఎస్ మునగడం ఖాయమైందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. కాపీల మాస్టర్ అయిన కేసీఆర్ 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన మేనిఫేస్టోకు కాపీ కొట్టారని అన్నారు. 2018లో మహాకూటమి కామన్ మినిమం ప్రోగ్రాంలో చెప్పిన రుణమాఫీ, పెన్షన్ పెంపు, రైతులకు ఆర్థిక భరోసా కార్యక్రమాలనే తిరిగి టీఆర్ఎస్ పేర్కొందని అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో కేం ద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో అన్యాయం చేసిందని, కేంద్రం తీరుపై టీడీపీ ధర్మపోరాటం చేస్తోందని ఆంధ్రా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం నాడు ఆయన ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ రాజనాధ్ సింగ్ తుఫాను బాధితులను పరామర్శించకపోవడం దారుణం అని అన్నారు.