-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
సిద్దిపేట, అక్టోబర్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని.. వచ్చే ఫిబ్రవరి నాటికి గోదావరి నీటిని సిద్దిపేట ప్రజలకు అందించేందుకు కృషిచేస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16 జిల్లాలకు సాగునీరు అందించబోతున్నట్లు తెలిపారు.
ధన్వాడ, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో రెండు కుటమూలను తెలంగాణ రాష్ట్రప్రజలు ఓటు ఆయుధంతో పెకిలించాలని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ధన్వాడ మండల కేంద్రంలో బీజేపీ అధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గం బూత్స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: ఓటర్ల జాబితాలో జరిగిన అవతవకలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎన్నికల సంఘానికి ఇదే నా సవాల్ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి సవాల్ అన్నారు. రాష్ట్ర హైకోర్టును ఎన్నికల సంఘం తప్పుదారి పట్టించిందని శశిధర్ రెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.
హైదరాబాద్: ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాలను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రావత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈమేరకు స్థానిక తాజ్కృష్ణా హోటల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వాహనాలను ఆయన ప్రారంభించారు.
గజ్వేల్, అక్టోబర్ 22: ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వంచకపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీల కుట్రలతో మహా కూటమి ఏర్పడగా, ఆ కూటమిని కూకటి వేళ్లతో పెకలిద్దామని మాజీ ఎమ్మెల్యే, మంత్రి తన్నీరు హరీష్రావు స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్లో టీఆర్ఎస్ ప్రచార శంఖారావం పూరించిన సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: యుఎస్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడం గ్రోస్కే పేర్కొన్నారు. భారతీయులు ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్నకు పోటీ పడాలని ఆమె సూచించారు. సోమవారం నాడు ఆమె ఇఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్కుమార్ను కలుసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: ఎన్నికల అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: కులరహిత సమాజ సాధనకు అంతా కలిసి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు అవసరమైతే దళితులు మిగిలిన వర్గాలనూ కలుపుకుంటూ పోవాలని సోమవారం నాడిక్కడ జరిగిన దళిత స్ర్తి శక్తి, ఆఫీసర్సు ఫోరం సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 22: ముందస్తు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బోగస్ ఓట్లు తొలగించలేదని, కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, ఇందుకు వీలుగా కమిషన్ వెబ్ సైట్ పనిచేయడం లేదని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 22: సినీనటి రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆమెను తెలుగు దేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సహా పలువురు నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులతో ఎన్టీఆర్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమై చర్చించరు.