S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/23/2018 - 02:13

హైదరాబాద్, అక్టోబర్ 22: ముందస్తు ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్‌కు ప్రాధాన్యతనిచ్చి అధిక సీట్లు కేటాయించాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద అధ్యక్షతన సోమవారం మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనెట్ డిసౌజా హాజరయ్యారు.

10/23/2018 - 02:12

హైదరాబాద్, అక్టోబర్ 22: రాజకీయాల్లో భీష్మ పితామహుడైన తమిళనాడు మాజీ గవర్నర్ కే. రోశయ్యను అవమానించిన రాష్ట్ర అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు వెంటనే క్షమాపణ చెప్పాలని టీ.పీసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ సద్భావన దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా కే. రోశయ్యను సద్భావన అవార్డును అందించడం జరిగిందన్నారు.

10/23/2018 - 02:11

హైదరాబాద్, అక్టోబర్ 22: ముందస్తు ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు సర్దుబాట్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరి బాగా లేదని తెలంగాణ జన సమితి, సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

10/22/2018 - 14:11

కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వెనక నుంచి కారు ఢీ కొని సమీపంలో ఉన్న విద్యుత్‌ స్తంభంవైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు.

10/22/2018 - 14:10

హైదరాబాద్: టీటీడీపీ పోలీట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మహాకూటమితో పొత్తు విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలని, గెలిచే సీట్లను వదులుకోవద్దని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తును ఆయన సమర్థించారు. ఈ సమావేశంలో సీట్ల కేటాయింపుపై చర్చించారు. మహాకూటమి గెలుపునకు టీడీపీ కార్యకర్తలు కష్టపడాలని అన్నారు.

10/22/2018 - 12:56

సికింద్రాబాద్‌ : సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ప్రయాణిస్తున్న కారు.. సోమవారం కార్ఖానాలోని ఇంపీరియల్‌ గార్డెన్‌ వద్ద అదుపు తప్పి ఓ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు సహా వారి చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే వారిని యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సురేష్‌బాబుకు నోటీసులు ఇచ్చారు.

10/22/2018 - 05:25

గద్వాల, అక్టోబర్ 21: నాలుగు రోజులుగా కర్ణాటక, కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు ఏడు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్టు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.

10/22/2018 - 05:22

హుజూర్‌నగర్, అక్టోబర్ 21 : తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో బీసీ కులాలకు చెందిన ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యమైతే రాజ్యాధికారం బీసీలదేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.

10/22/2018 - 05:16

సూర్యాపేట, అక్టోబర్ 21: రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య కూడలిగా తెలంగాణలో ప్రత్యేక స్థానం పొందిన సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిత్వం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుకు ఖరారైంది. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన తొలి జాబితాలో ఈమేరకు ప్రకటించారు.

10/22/2018 - 02:34

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ నేతృత్వంలో 11 మంది సభ్యుల బృందం సోమవారం హైదరాబాద్ వస్తోంది. ఈ బృందం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుంది. కేంద్ర బృందం తన కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌నగరానికే పరిమితం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు.

Pages