-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 17: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ప్రాధమిక కీని విడుదల చేశారు. రాత పరీక్ష ప్రాధమిక కీని టీఎస్పీఆర్ రిక్రూట్మెంట్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఎంపిక పరీక్షను అక్టోబర్ 10వ తేదీన నిర్వహించారు. 9355 పోస్టులకు గానూ 5,62,495 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట లేఖ విడుదల అయింది. ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది నెలల ముందే కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మహాకూటమి పేరుతో సీపీఐ, తెలంగాణ సమితి బూర్జవా పార్టీలతో జత కట్టాయని విమర్శించారు.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, హిమయత్నగర్, హైదర్గూడ, లక్డీకాపూల్, సుల్తాన్బజార్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్ఆర్నగర్, సనత్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
బాసర: చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
నల్లగొండ, అక్టోబర్ 16: నల్లగొండ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు కోసం రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు మంగళవారం సాయంత్రం తమ ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్తో రాస్తారోకోకు దిగారు. దీంతో రైతులపై నల్లగొండ పోలీసులు దౌర్జన్యకరంగా ప్రవర్తించిన ఘటన పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది.
అల్లాదుర్గం, అక్టోబర్ 16: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పెట్టడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కాదా అని అందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. ప్రజలు ఐదు సంవత్సరాల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెరాస ప్రభుత్వం తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో అభివృద్ధి వెనక్కిపోయిందన్నారు.
లింగాల, అక్టోబర్ 16: పురుగుల మందుతాగి మాజీ మావోయిస్టు గుండూరి శ్రీను అలియాస్ రమాకాంత్(45) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అంబడిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎఎస్సై అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.
కామారెడ్డి, అక్టోబర్ 16: యువకుల బలిదానాల కారణంగా చలించిపోయిన సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చారని శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కామారెడ్డి, పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: రాజకీయ పార్టీల పట్ల కక్షపూరిత ధోరణిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించడంతోనే కాంగ్రెస్- టీడీపీల మహా కూటమి సాధ్యమైందని టీటీడీపీ నేత ఎల్ రమణ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మహా కూటమిని కేసీఆర్ తక్కువ అంచనా వేస్తున్నారని, మహా కూటమి రానున్న ఎన్నికల్లో 80 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: హిందువులను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగరరావు పేర్కొన్నారు. హిందువులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని తేలిపోయిందని ఆయన చెప్పారు. మంగళవారం నాడు ఆయన పార్టీ రాష్టక్రార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ రామమందిర నిర్మాణానికి వ్యతిరేకమని తెలిందని చెప్పారు.