-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూలై 31: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అమర్జిత్ సిన్హా తెలిపారు.
హైదరాబాద్, జూలై 31: ఫార్మా-డీ కోర్సును ఎంబీబీఎస్తో సమానంగా గుర్తించమని ఇంత వరకూ ఎవరూ కోరలేదని, అలా కోరితే ఆ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరేళ్ల ఫార్మాడీ కోర్సును అన్ని ఫార్మసీ కాలేజీలు నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్, జూలై 31: హైదరాబాద్లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి-హబ్ ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాలలో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతో పాటు తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి-హబ్ ఉపయోగపడుతుందన్నారు.
హైదరాబాద్, జూలై 31: రిజర్వేషన్ అంశంపై లోతైన అధ్యయనానికి నిపుణులతో చర్చిస్తున్నట్టు జనసేన అధినేత పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన హైదరాబాద్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్మాణంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలపై ఈ కమిటీ చర్చించింది.
హైదరాబాద్, జూలై 31: తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. తుది విడత అడ్మిషన్లను మంగళవారం నాడు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. తుది విడతకు 20,741 మంది వెబ్ ఆప్షన్లను ఇవ్వగా, 19,145 మందికి సీట్లు దక్కాయి. 5397 మంది స్లయిడింగ్కు దరఖాస్తు చేసుకోగా, అందులో 4120 మంది స్లయిడింగ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 31: సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళగా ఉన్న జనరల్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, సంబంధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సిఎండి శ్రీ్ధర్కు ఆ సంస్థ ఉద్యోగుల అసోషియేషన్ సూచించింది.
నల్లగొండ, జూలై 30: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల పిదప అధికార మార్పిడి తథ్యమని, ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదని, నూతన ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ నిర్ణయాత్మక భూమిక పోషించనుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.
మంచిర్యాల, జూలై 30: తెలంగాణ రాష్ట్ర అటవీ, సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు ప్రమాదం తృటిలో తప్పింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎయిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి జోగు రామన్న విచ్చేశారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఎక్కడంతో ప్రమాదవశాత్తు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్కు జారి పడింది.
హైదరాబాద్, జూలై 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టులు, గురుకుల విద్యాలయాలు, కొత్త జిల్లాలు, రోడ్ల నిర్మాణం తదితర వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 30: జోగిని శ్యామల శాపం కేసీఆర్ సర్కారుకు మంచిది కాదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. జోగిని చెప్పినవన్ని గతంలో నిజాలు అయ్యాయని అన్నారు. తెలంగాణలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఆమె వివరించిందని చెప్పారు. కేసీఆర్ కుమార్తె కవిత బోనం ఎత్తుకుంటేనే బోనాల పండుగ అన్నట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఎంత మాత్రం సరికాదన్నారు.