28 ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి
Published Monday, 1 August 2016ఏలూరు, జూలై 31: ఏలూరు రేంజ్ పరిధిలో 2007 బ్యాచ్కు చెందిన 28 ఎస్సైలకు సిఐలుగా పదోన్నతి లభించనుంది. మొత్తం ఈ బ్యాచ్లో 34మంది ఉండగా వీరిలో ఆరుగురు శాఖాపరమైన విచారణలు ఎదుర్కొంటున్నందున వారిని మినహాయించి మిగిలిన 28మందికి పదోన్నతి కల్పించనున్నారు. సోమవారం ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ ఈ జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ జాబితాలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎస్సైలకు పదోన్నతి లభించనుంది.