పాక్పై భారత్ నిందలు
Published Sunday, 25 September 2016ఇస్లామాబాద్:కాశ్మీర్లోని ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడులతో పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదని, ఎటువంటి విచారణ లేకుండా, ఆధారాలు చూపకుండా పాకిస్తాన్పై భారత్ నిందలు మోపుతోందని, దుష్ప్రచారం చేస్తోందని ఆ దేశ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తార్ అజీజ్ ఆరోపించారు. భారత్కు ఇది అలవాటుగా మారిందని అన్నారు. ఇక తమదేశంపై ఎవరు యుద్ధానికి వచ్చినా మిత్రదేశం చైనా అండగా ఉంటుందన్న హామీ లభించిందని పాకిస్తాన్ గర్వంగా ప్రకటించుకుంది.