S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 29: చెట్లు లేకపోతే బతుకు లేదని, చెట్లవల్లనే అక్సిజన్ లభిస్తుందని భూగర్భజలాలు పెరుగుతాయని అందువల్ల చెట్లు పెంచడం అత్యంత ఆవశ్యకమని హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు. నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎజెసి స్థానిక కార్పొరేటర్ మమతగుప్తా, ఎజెసి ఆశోక్కుమార్లతో కలిసి మొక్కలు నాటారు.
హైదరాబాద్, జూలై 29: వర్షాకాలం ప్రజల పాలిట ప్రాణ సంకటంగా మారిన నగరంలోని శిథిల భవనాల కూల్చివేత పనులను జిహెచ్ఎంసి అధికారులు మరింత ముమ్మరం చేశారు.
హైదరాబాద్, జూలై 29: మహానగరవాసులకు పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఇప్పటి వరకు అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టిన జిహెచ్ఎంసి అధికారులు ఇపుడు నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఘట్కేసర్, జూలై 29: ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారన్న మనస్తాపం, తల్లిదండ్రుల ఆశయం మేరకు చదువులో రాణించలేక పోతున్నాననే వ్యధతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్, జూలై 29: భారతీయ జనతా మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా సమావేశం శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు రజనీరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు జి.విజయలక్ష్మి.
హైదరాబాద్, జూలై 29: రంగారెడ్డి జిల్లాలో రెండు బాలుర పాఠశాలలు, కందుకూర్, ఇబ్రహీంపట్నంలో రెండు బాలికల పాఠశాలలు, తాండూర్, పరిగిలో బాల బాలికల కోసం నూతనంగా ప్రారంభమయ్యే గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవతరగతిలో ఎస్టి-64, ఎస్సి-10, బిసి-4, ఓసి-2 మొత్తం 80, ఆరవతరగతిలో ఎస్టి-32, ఎస్సి-5, బిసి-2, ఓసి-1 మొత్తం 40 సీట్ల కోసం జిల్లాలోని బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆ
కాచిగూడ, జూలై 29: ఓ ఇల్లాలు తన చిన్నారి కూతురితో సహా అపార్ట్మెంట్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. కాచిగూడ ఇన్స్స్పెక్టర్ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట్కు చెందిన హనుమయ్య చిన్న కూతురు రేణుక (30)ని 2002 సంవత్సరంలో ఉప్పుగూడ, శివాజినగర్ ప్రాంతానికి చెందిన రంగంపేట రవికి ఇచ్చి వివాహం జరిపించారు.
హైదరాబాద్, జూలై 29: మెట్రోరైలు ప్రాజెక్టు కోసం పోలీసు శాఖకు చెందిన రసూల్పురా క్వార్టర్స్, మరో అయిదు ప్రాంతాల్లో అదే విభాగానికి చెందిన స్థలాలను సేకరించిన అధికారులు రూ. 25 కోట్ల అంఛనా వ్యయంతో నిర్మిస్తున్న పోలీసు బ్యారెక్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్లు మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎన్వీఎస్.రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, జూలై 29: జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల నాణ్యత ప్రమాణాలపై థర్డ్ పార్టీ అందజేసిన నివేదికలపై చేపట్టిన చర్యలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులను కమిషనర్ జనార్దన్రెడ్డి ఆదేశించారు.
ఖైరతాబాద్, జూలై 29: జిహెచ్ఎంసి సెంట్రల్ జోన్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్టు జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జోనల్ పరిధిలో సర్కిళ్లవారీగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పురాతన భవనాలను గుర్తించినట్టు చెప్పారు. సర్కిల్ -7లో 110, సర్కిల్ -8లో 200, 9లో 200, 10లో 60 భవనాలు ఉన్నట్టు చెప్పారు.