S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/24/2017 - 04:39

తిరుపతి, ఫిబ్రవరి 23: సినిమాల్లో గ్రాఫిక్స్ చూపిస్తే అందరూ ఆదరిస్తారని, అలాగని నిజజీవితంలోకూడా రాష్ట్భ్రావృద్ధిపై లెక్కల గారడీ చేసి ప్రజలను మోసగించడం తగదని సిపిఎం నేత బి వి రాఘవులు అన్నారు. ప్రజాచైతన్యబస్సు యాత్రలో పాల్గొనడానికి తిరుపతి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.

02/23/2017 - 11:59

శ్రీకాకుళం: . జిల్లాలోని ఆముదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌, పొందూరు సమీపంలో గురువారం పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగింది. ఇది గమనించిన గ్యాంగ్‌మ్యాన్ అప్రమత్తంగా వ్యవహరించి, అధికారులకు సమాచారం అందించాడు దీంతో ఆ మార్గంలో వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటుగా ప్రయాణించాల్సిన రైళ్లను ఆముదాలవలస, చీపురుపల్లి స్టేషన్లలో ఆపివేశారు.

02/23/2017 - 08:11

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆర్థిక సంవత్సరం ముగింపుకు 50 రోజులు ముందు నుంచే ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు, ప్రయాణ భత్యాలు, స్కాలర్‌షిప్‌ల నుంచి ఆసుపత్రులు, జైళ్లు, హాస్టళ్లలో డైట్ బిల్లులు వరకు.. అలాగే కాంట్రాక్టు బిల్లులు సైతం ట్రెజరీ కార్యాలయాల్లో చెల్లింపులు పూర్తిగా నిలిపివేసి 15 రోజులు దాటింది. దీన్నిబట్టి చూస్తేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.

02/23/2017 - 08:10

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 22: అనంతపురం జెఎన్‌టియూకు విసి సర్కార్ వనె్నతెచ్చారని చెప్పాలి. 2015 అక్టోబర్ 26న జెఎన్‌టియూ అనంతపురం ఉపకులపతిగా సర్కార్ బాధ్యతలు చేపట్టారు. యూనివర్సిటీలో ఆడిటోరియం నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులు చేయించారు. విద్యార్థుల హాస్టల్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులకు అవసరమైన స్కిల్ డెవలంప్‌మెంట్ శిక్షణ కోసం ఇతర దేశాల యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

02/23/2017 - 08:10

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: విశాఖ జిల్లా భీమునిపట్నం తహశీల్దారు బిటివి రామారావు, ఆయన బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్, రాజమండ్రి పట్టణాల్లోని ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

02/23/2017 - 08:09

శ్రీశైలం, ఫిబ్రవరి 22: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ నిర్వహించారు. ఉదయం జపాలు, మండపారాధనలు, రుద్ర, చండీ హోమాలు, చండీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. మహామంగళ హారతి అనంతరం పుష్పపల్లకి సేవ నిర్వహించారు.

02/23/2017 - 08:28

విజయవాడ, ఫిబ్రవరి 22: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండున్నర సంవత్సరాలుగా అవిశ్రాంతంగా చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాలలో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు భేటీలు నిర్వహించారని, దాని పర్యవసానమే నేడు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

02/23/2017 - 02:00

హైదరాబాద్, ఫిబ్రవరి 22: టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు వెంటనే ప్రతి నెల భృతిని చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాశారు. వచ్చే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి చెల్లింపునకు నిధులు కేటాయించాలని కోరారు. లేని పక్షంలో తమ పార్టీ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందన్నారు.

02/23/2017 - 01:59

పామిడి, ఫిబ్రవరి 22: అనంతపురం జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో అనంతపురం జెఎన్‌టియు వైస్ ఛాన్స్‌లర్ ఎంఎంఎం.సర్కార్(65) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈప్రమాదంలో సర్కార్‌తో పాటు కారు డ్రైవర్ నాగప్రసాద్(30), వ్యిక్తిగత సహాయకుడు బాబా ఫక్రుద్దీన్(32) కూడా దుర్మరణం చెందారు.

02/23/2017 - 01:51

విజయవాడ, ఫిబ్రవరి 22: పర్యావరణ పరిరక్షణతోపాటు విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గింపుకోసం ఇక సౌర, పవన్ విద్యుత్ ఉత్పత్తికి పెద్దపీట వేస్తామని ఎపి ఇంధనశాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. దశల వారీగా ప్రస్తుతం పనిచేస్తున్న థర్మల్ పవర్ స్టేషన్లను మూసివేయటం జరుగుతుందన్నారు. బొగ్గ్ధుర అనూహ్యంగా పెరగడం కూడా దీనికి కారణమని చెప్పారు.

Pages