S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/26/2017 - 03:38

అమరావతి, ఫిబ్రవరి 25: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్ఠకు సవాలుగా మారింది. ఈ ఫలితంతో జగన్‌కు స్థానికంగానే బలం లేదని చాటేందుకు తెదేపా నేతలు, బాబాయ్‌ను గెలిపించుకుని జిల్లాలో తెదేపాకు స్థానం లేదని చాటేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

02/26/2017 - 03:35

విజయవాడ, ఫిబ్రవరి 25: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడుల ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు భారతీయులపై దాడులు, హత్యలకు దారితీస్తున్నా ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

02/26/2017 - 03:27

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బంగారు రాజధాని కాదు కదా.. రోల్డ్ గోల్డ్ రాజధాని కూడా నిర్మించలేరని, కాగితాలకు, ప్రచారానికే పరిమితం అని యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అబ్రహం రాయ్‌మణి, కార్యదర్శి వి వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దళితుల ఆత్మగౌరవం కించపర్చే విధంగా టిడిపి పాలన సాగుతోందని, చంద్రబాబు దళిత వ్యతిరేకి అని ఆరోపించారు.

02/26/2017 - 03:22

చోడవరం, ఫిబ్రవరి 25: హుదూద్ తుపాను నేపథ్యంలో తడిచిన పంచదార అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిన విశాఖ జిల్లా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులను శనివారం కర్మాగారం ఎండి విక్టర్ రాజు సస్పెండ్ చేసారు. రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్ ఎల్. మురళీ ఈనెల 17న ఆర్‌సి నెంబర్ 2535-2015 బి 3 పేరిట జారీ చేసిన ఆదేశాల మేరకు అవకతవకలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు శనివారం వెల్లడించారు.

02/26/2017 - 03:22

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 25: హాలాహలం తాగిన శివుడు మగత నిద్రలోకి జారుకొని తిరిగి మేల్కోనే ఉత్సవమే లింగోద్భవం. మహాశివరాత్రి తరువాత ఆలయంలో వైభవంగా సంప్రదాయ రీతిలో ఈ ఉత్సవం జరగడం ఆనవాయితీ. అయితే ఇఓ ఏకపక్ష నిర్ణయాలతో ఉత్సవం మొత్తం రసాభాసగా మారింది. ఇఓకు, ట్రస్టుబోర్డుకు ఉన్న బేధాభిప్రాయాలు మరోసారి బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకున్నారు.

02/26/2017 - 02:19

అమరావతి, ఫిబ్రవరి 25:4ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం - ఆనందంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం2 అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం అమరావతిలోని తన నివాసం నుంచి వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందించడంలో భాగంగా గ్రామాలు, వార్డుల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు.

02/26/2017 - 02:18

మదనపల్లె, ఫిబ్రవరి 25: నకలీపత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన నకలీ ఆడిటర్‌ను శనివారం మదనపల్లె పోలీసులు అరెస్టుచేసి, వారివద్ద నుంచి కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని, బ్యాంకు లాకర్లు సీజ్‌చేశారు.

02/26/2017 - 02:17

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రారంభమయ్యే కొత్త శాసనసభలోనైనా సంప్రదాయాలను పాటించి సభను సజావుగా నడిపించాలని వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత మూడేళ్లగా ప్రతిపక్షానికి శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని, అమరావతిలోనైనా సభా సంప్రదాయాలను పాటించి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వాలని కోరారు.

02/25/2017 - 04:46

అమరావతి, ఫిబ్రవరి 24: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన గుంటూరు జిల్లా అమరావతి దివ్యక్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు పవిత్రకృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. స్వామివారి అభిషేకం అనంతరం భక్తులు పరమశివుడిని దర్శించుకున్నారు.

02/25/2017 - 04:45

గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 24: విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి- కొయ్యూరు మండలాల్లో శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈసంఘటనలో మావోయిస్టు కీలక నేత జాంబ్రి, మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కమాండర్ చిట్టిబాబు అలియాస్ కిశోర్ మృతిచెందారు. గత కొంత కాలంగా మావోయిస్టు నేత జాంబ్రి కోసం పోలీసులు పలు వ్యూహాలు పన్నినప్పటికీ వీరు పట్టుబడకుండా తప్పించుకున్నారు.

Pages