S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/03/2017 - 03:28

విజయవాడ, ఫిబ్రవరి 2: అమరావతి పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి తెలిపారు. తుళ్లూరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా శుక్రవారం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు.

02/03/2017 - 03:26

తిరుపతి/ భీమవరం, ఫిబ్రవరి 2: ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జెఏసి చైర్మన్ అశోక్‌బాబు పూర్తిగా విఫలమయ్యారని, ఈనేపథ్యంలో జెఏసి చైర్మన్‌గా బొప్పరాజు వెంకటేశ్వర్లును ఎన్నుకోనున్నట్లు ఏపి రెవిన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.నరసింహులు నాయుడు తెలిపారు.

02/03/2017 - 03:26

విజయవాడ, ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై తాను ప్రభుత్వంతో లాలూచీపడి వ్యవహరిస్తున్నట్టు కొందరు ఉద్యోగ సంఘాల నేతల్లో వున్న అపోహను తొలగించేందుకు జెఎసి నేతలతో కలిసి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి అశోక్‌బాబు అన్నారు. త్వరలో జరిగే సంఘం రాష్ట్ర ఎన్నికలు లాంఛనప్రాయమేనన్నారు.

02/03/2017 - 03:25

విశాఖపట్నం, ఫిబ్రవరి 2: ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ హాల్‌లో న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధల్ అమర్ చంద్ మంగళ్‌దాస్ అండ్‌కో ఆధ్వర్యంలో ఫిక్కీ (ఇండిపెండెంట్ స్కూల్ అలియన్స్) సభ్యులతో మంత్రి సమీక్షించారు.

02/03/2017 - 03:24

విశాఖపట్నం, ఫిబ్రవరి 2: మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడం, వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సిజిఆర్‌ఎఫ్) ఏర్పాటు చేసినట్టు వేదిక చైర్‌పర్సన్, విశ్రాంత జడ్జి దుంపల ధర్మారావు తెలిపారు. దీనివల్ల విద్యుత్ సంబంధిత సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించుకునే వీలుంటుందన్నారు.

02/03/2017 - 03:24

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 2: ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం మహిళాలోకం ఉద్యమించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైతే తాను నిరాహారదీక్ష చేసేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

02/03/2017 - 03:00

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఎపిలో అర్చకుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండురోజుల్లో ముఖ్యమంత్రి సంతకం అయ్యే అవకాశాలుంటాయని తెలిసింది. ముఖ్యమంత్రి సంతకం కాగానే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతాయి. సర్వీసు నిబంధనల కోసం చాలా సంవత్సరాల నుండి అర్చకులు వేచి చూస్తున్నారు.

02/03/2017 - 03:00

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్‌లో 8662 స్కూళ్లు ఏకోపాధ్యాయులతోనే పనిచేస్తున్నాయి. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపించిన నివేదికలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 11.05 లక్షల స్కూళ్లు ఉండగా, అందులో 97,923 స్కూళ్లు ఏకోపాధ్యాయులతోనే పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్రాలకే ఉండటంతో కేంద్రం ఆర్ధిక నిధులను సమకూర్చడం మినహా ఏ విధమైన ఒత్తిడిని తీసుకురాలేకపోతోంది.

02/03/2017 - 02:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లు విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. గురువారం ఈ పిటిషన్లపై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కుడిన ధర్నాసనం విచారణ జరిపింది. పిటిషన్ల తరపున న్యాయవాది రిత్విక్ దత్త వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతులు మంజురు చేయడానికి ఎలాంటి పారదర్శకత పాటించలేదన్నారు.

02/03/2017 - 02:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పట్టణ వౌలిక సదుపాయాలను కల్పించేందుకు రానున్న మూడు సంవత్సరాల్లో రూ. 1,350 కోట్ల పెట్టుబడులు పట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల కోసం కేంద్రం వాటా కింద 405 కోట్లు ఇచ్చేందుకు పట్టణాభివృద్ది శాఖ ఆమోదం తెలిపింది.

Pages