S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/10/2016 - 16:30

హైదరాబాద్:తెలంగాణ అంతటా సోమవారం నిర్వహించబోయే హరితహారం కార్యక్రమంలో సర్పంచ్‌నుంచి మంత్రి వరకు అందరూ పాలుపంచుకోవాలని లేనిపక్షంలో తీవ్రంగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం అమలుకోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఆయన సమీక్షించారు.

07/10/2016 - 16:29

ఆస్తానా:ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని కజకిస్తాన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. రాజధాని ఆస్తానాలో ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పర్యటించింది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో చంద్రబాబుకు ఆ దేశ రాయబారి సాదర స్వాగతం పలికారు. స్థానిక రాష్ట్రప్రభుత్వం, మేయర్‌లతో బాబు చర్చలు జరిపారు.

07/10/2016 - 07:59

విజయవాడ, జూలై 9: కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అన్ని నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావాలని, ముఖ్యంగా స్నాన ఘట్టాల నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చినందున ఇక యాత్రికులకు అవసరమైన వసతి, ఇతర సౌకర్యాలపై దృష్టి సారించాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంక్షేమ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.

07/10/2016 - 07:56

విజయవాడ, జూలై 9: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ పథకం కంటే భిన్నంగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ అట్టహాసంగా సొంత గూడు సౌకర్యం కలుగచేస్తానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్లుగా ఊరూవాడా విస్తృత ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ నేత వర్ల రామయ్యను గృహ నిర్మాణ సంస్థకు చైర్మన్‌గా కూడా నియమించారు.

07/10/2016 - 07:56

విజయవాడ, జూలై 9: ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని సముద్ర తీర గ్రామమైన మోటుపల్లిలో ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో ప్రముఖ పురాతీస్తు శాస్తవ్రేత్త డా.ఈమని శివనాగిరెడ్డి జరిపిన పరిశోధల్లో చోళులకాలం నాటి బౌద్ధ అవశేషాలు, పురాతనమైన మట్టిపాత్రల శకలాలు బయల్పడ్డాయి.

07/10/2016 - 07:53

సింహాచలం, జూలై 9: కృతయుగ దైవం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనార్థం సింహగిరికి తరలి వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి స్వచ్ఛంద సేవకులు ముందుకు వస్తున్నారు.

07/10/2016 - 07:53

ఏలూరు, జూలై 9: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి పెంచిన గౌరవవేతనాన్ని సోమవారం నుంచి అమలుచేస్తామని రాష్ట్ర గనులు, స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు.

07/10/2016 - 07:50

విశాఖపట్నం, జూలై 9: ఏజెన్సీల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్లకు రెట్టింపు జీతాలు (డబుల్ శాలరీ) చెల్లించనున్నట్టు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ కార్యక్రమాన్ని విశాఖలో శనివారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో రక్త నిల్వ కేంద్రాలతో పాటు మినీ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

07/10/2016 - 07:47

న్యూఢిల్లీ, జూలై 9: కృష్ణా పుష్కరాలకు మూడు నుంచి నాలుగు కోట్లు మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుచెప్పారు. ఢిల్లీలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఎక్కువ మంది భక్తులు విజయవాడలోనే పుష్కర స్నానం చేసే అవకాశం ఉందని అన్నారు. పుష్కరాలకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు.

07/10/2016 - 07:47

గుంటూరు, జూలై 9: రాష్ట్రప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. శనివారం డళజూళఆ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Pages