S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/15/2019 - 21:25

ముంబయి, ఫిబ్రవరి 15: ముంబయికి చెందిన రియాలిటీ సంస్థ ‘లోథా డెవలపర్స్’ లండన్‌లోని తన డెవలప్‌మెంట్ విభాగం నుంచి అదనపువాటాలను వెనక్కు తీసుకోనుందని రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం ఇక్కడ తెలియజేసింది. 2020 మార్చి నాటికి బాండ్ మెచూరిటీలోగా ఈ కంపెనీ తన పరపతిని తగ్గించుకుని అదనంగా నిధులను సమీకరించాలని నిర్ణయించుకుందని ఆ ఏజెన్సీ తెలియజేసింది.

02/15/2019 - 21:24

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో కమ్మోడిటీ రిరైవేటివ్ సెగ్మెంట్‌ను ప్రారంభిస్తున్న సెబీ డబ్ల్యూటీఎం మొహంతి, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ తదితరులు.

02/15/2019 - 21:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: దేశ వ్యాప్తంగా గత మూడేళ్లలో వేలం వేసిన 55 గనులకు చెందిన ఐదు ఖనిజ బ్లాకులు పనులు ఆరంభించేందుకు సిద్ధమయ్యాయి. మరో రెండు లేదా మూడు గనులు సైతం వచ్చే నెలాఖరుకల్లా పనులు ప్రారంభిస్తాయని కేంద్ర గనుల శాఖ శుక్రవారం తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 గనుల్లో పనులు ప్రారంభమవుతాయని కేంద్ర గనుల శాఖ కార్యదర్శి అనిల్ గోపీ శంకర్ ముకిమ్ తెలిపారు.

02/15/2019 - 21:19

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
వెండి
8 గ్రాములు: రూ. 319.20

02/14/2019 - 23:52

ముంబయి, ఫిబ్రవరి 14: ఎస్ బ్యాంక్ వాటాలకు గురువారం నాటి ట్రేడింగ్‌లో అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలకు కేటాయింపులు జరపడంతో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆర్‌బీఐ తన నివేదికలో స్పష్టం చేసినట్టు ఎస్ బ్యాంక్ ప్రకటించిన వెంటనే, షేర్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది.

02/14/2019 - 23:51

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,236.00
8 గ్రాములు: రూ.25,888.00
10 గ్రాములు: రూ. 32,360.00
100 గ్రాములు: రూ.3,23,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,460.963
8 గ్రాములు: రూ. 27,687.704
10 గ్రాములు: రూ. 34,609.63
100 గ్రాములు: రూ. 3,46,096.3
వెండి
8 గ్రాములు: రూ. 342.40

02/14/2019 - 23:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: స్టాక్ మార్కెట్ మాదిరిగానే భారత బులియన్ మార్కెట్ కూడా గురువారం నష్టాలను ఎదుర్కొంది. మరుసగా ఐదోరోజు బంగారం ధర పతనం కావడం విశేషం. విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లను తగ్గించినప్పటికీ, దేశీయ డిమాండ్ బులియన్ మార్కెట్‌ను ఆదుకుంటూ వచ్చింది. అయితే, గత ఐదు రోజులుగా దేశీయ మదుపరుల నుంచి కూడా డిమాండ్ కనిపించడం లేదు.

02/14/2019 - 23:48

ముంబయి, ఫిబ్రవరి 14: ఎక్స్‌యూవీ-500 సిరీస్‌లో తక్కువ ధరతో కొత్త వాహనాన్ని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ గురువారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ మొడల్‌ను ఎక్స్‌యూవీ-300గా ప్రకటించింది. ఈ సబ్-4 మీటర్ వాహనం పెట్రోలు, డీజిల్ వర్షన్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ధర 7.90 నుంచి 8.49 లక్షల రూపాయల మధ్య ఉంటుందని వివరించింది.

02/14/2019 - 23:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: హిందుజాగ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ లాభాల్లో 21.44 శాతం త్రైమాసిక తగ్గుదలను నమోదు చేసింది. గడచిన డిసెంబర్‌తోముగిసిన మూడోత్రైమాసిక ఫలితాలను ఆ కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 381 కోట్ల రూపాయల లాభాలను కంపెనీ ఆర్జించింది. ఐతే గడచిన ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 21.44 శాతం తక్కువ.

02/15/2019 - 14:09

ముంబయి, ఫిబ్రవరి 14: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో చాలా రోజులుగా బుల్ రన్ కనిపించడం లేదు. వాటాల అమ్మకాల ఒత్తిళ్లు పెరగడంతో వరుసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 157.89 పాయింట్లు (0.44 శాతం) పతనమై, 35,876.22 పాయింట్ల వద్ద ముగిసింది. ఐదు సెషన్లలో ఎదురైన నష్టాల నుంచి గట్టెక్కుతుందనుకున్న స్టాక్ బ్రోకర్లు, మదుపరులకు ఆరో రోజు కూడా నిరాశే ఎదురైంది.

Pages