-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
నాగార్జునసాగర్, అక్టోబర్ 21: నాగార్జునసాగర్ను సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ మరో సౌకర్యాన్ని సందర్శకులకు శనివారం నుండి అందుబాటులోకి తెచ్చింది. నాగార్జునసాగర్ అటవీ అందాలు, జలాశయ అందాలను వీక్షించే విధంగా పర్యాటకులు వ్యూపాయింట్కు చేరుకుని అక్కడి నుండి సాగర్ అందాలను చూసేవిధంగా రూ.3.70 లక్షల వ్యయంతో వ్యూపాయింట్, వాచ్టవర్ను నిర్మాణం చేసింది.
వరంగల్, అక్టోబర్ 21: ఇరవై వేలమందికి ప్రత్యక్షంగా, మరో లక్షమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం శంకుస్థాపన చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 21: భారతదేశంలో అతి పెద్ద కేబుల్ బ్రాండ్ ప్రొవైడర్ హాత్వే , ప్రపంచంలో అత పెద్ద ఓవర్ ది టాప్ సౌత్ ఆసియన్ కంటెంట్ ప్రొవైడర్ యప్ టీవీతో చేతులు కలిపింది. వినియోగదారులకు లైవ్ టీవి, ఆన్ డిమాండ్ నాణ్యమైన వినోదం కంటెంట? అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నుట్ల హాత్వే సంస్ధ ఎండి రాజన్ గుప్తా తెలిపారు.
ముంబయి, అక్టోబర్ 20: హిందూ సంవత్ (సంవత్సరం) 2074 ప్రారంభాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం గంట సేపు ప్రత్యేకంగా నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. బిఎస్ఇ సెనె్సక్స్ సెషన్ ప్రారంభంలో పుంజుకున్నప్పటికీ, తరువాత పడిపోయి సెషన్ చివరలో 194 పాయింట్లు కోల్పోయి 32,389.96 పాయింట్లకు దిగజారింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: శుక్రవారం మధ్యాహ్నం వరకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన 33 లక్షల వస్తు, సేవల పన్ను (జిఎస్టి) రిటర్న్లు దాఖలయ్యాయని, జిఎస్టిఎన్ పోర్టల్లో గంటకు 75వేల విక్రయాల డాటా అప్లోడ్ అయిందని ఆ కంపెనీ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే తెలిపారు. జిఎస్టిలో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన జిఎస్టిఆర్-3బి ఇనిషియల్ రిటర్న్ల దాఖలుకు గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగుస్తోంది.
ఖమ్మం, అక్టోబర్ 20: గోదావరి పరివాహక ప్రాంతంలోని కోల్బెల్టు ప్రాంతాలలో కొత్తగా సింగరేణి బొగ్గు గనులను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం దృష్టి సారించింది. ఇటీవల కార్మిక సంఘాలకు జరిగిన గుర్తింపు ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం జిజిబికెఎస్ విజయం సాధించింది. దాంతో ప్రభుత్వం సింగరేణి సంస్థ అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకునేందుకు చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా రూ. 1,500 కోట్ల స్వల్పకాలిక రుణాలను తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు ఆ సంస్థ ఒక పత్రంలో పేర్కొంది.
హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకాల ద్వారా దాదాపు రూ.910కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలంగాణ సదరన్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి చెప్పారు.
సత్యవేడు, అక్టోబర్ 20: రెప్కో హోం ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్) చైర్మన్, భారత మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి ఎస్ కృష్ణమూర్తి శ్రీసిటీని శుక్రవారం సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి శ్రీసిటీ ప్రత్యేకతలు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను పరిశీలించారు.
గుంటూరు, అక్టోబర్ 20: ప్రపంచ మార్కెట్లో ఈ ఏడాది వాణిజ్య పంటలు మిర్చి, పసుపు ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దేశీయంగా ఈ-నామ్ తాకిడికి లావాదేవీలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.. కొత్తగా ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-నామ్ విధానం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 545 మార్కెట్ యార్డులలో అమలులో ఉంది.